అప్పుడే తొందరొద్దులే గుణశేఖరా..

Update: 2015-10-10 01:30 GMT
రుద్రమదేవి సినిమా ఎండింగ్ లో మరో చారిత్రాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తానని అధికారికంగానే ప్రకటించారు దర్శకుడు గుణశేఖర్. ఈ సారి రుద్రమ మనవడు ప్రతాపరుద్రుడి స్టోరీని తెరకెక్కిస్తానని.. అది దీనికి సీక్వెల్ అని.. రుద్రమ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చెప్పాడు గుణ.

ప్రతాపరుద్రుడిని దక్షిణ భారతానికి ఆఖరి భారత చక్రవర్తిగా చెప్పుకుంటారు. అయితే.. ఈ మూవీని తెరకెక్కించడం అంత తేలికేం కాదు. వాస్తవానికి ప్రతాపరుద్రుడి కథకి చాలా లింక్స్ ఉంటాయి. దీనికి కాస్టింగ్ సిద్ధం చేయడం కూడా కష్టమే. గోన గన్నారెడ్డి పాత్రకే.. బన్నీ స్వచ్ఛందంగా వస్తే తప్ప సెట్ కాలేదు. ఇప్పుడు ప్రతాపరుద్రుడి పాత్రను ఎవరు పోషిస్తారు ? అంత టైం ఎవరు కేటాయిస్తారు  ? అంత బడ్జెట్ ఎవరు పెడతారు ? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఎదురవుతున్నాయి.

ఇప్పటికే తన సొమ్ము మొత్తం రుద్రమదేవికి అంకితం ఇచ్చేశాడు గుణశేఖర్. ఇప్పుడు వెంటనే ప్రతాపరుద్రుడు తెరకెక్కించడం తేలికైన విషయం కాదని సలహా ఇస్తున్నాయి ఇండస్ట్రీవర్గాలు. ముందు రుద్రమకు పెట్టిన పెట్టుబడి రికవర్ అయ్యాక కొత్త వెంచర్ పై ఆలోచిస్తే బెటర్ అంటున్నారు. అందుకే ప్రతాపరుద్రుడి కోసం తొందరపడకు గుణశేఖరా అని సలహాలిస్తున్నారు. మరి వీటికి గుణ ఏమంటాడో ?
Tags:    

Similar News