గోపాల గోపాల సన్యాసిని నిఖిల్‌ హీరోయిన్‌

Update: 2015-08-02 06:26 GMT
టాలీవుడ్‌ లో దశాబ్ధ కాలంగా అవకాశాల కోసం వేచి చూసిన కథానాయిక ధీక్షా పంథ్‌. ఆరంభం మస్తీ వంటి చిన్నా చితకా ప్రాజెక్టు ల్లో గుంపులో గోవిందం తరహా క్యారెక్టర్ల లో నటించింది. కాలక్రమంలో ఈ భామను పిలిచి గోపాల గోపాల చిత్రంలో అవకాశం కల్పించాడు పవన్‌ కల్యాణ్‌. ప్రతిభ ఉన్న ఓ తెలుగమ్మాయికి ఆమాత్రం ఛాన్సివ్వకపోతే ఎలా? అని భావించారో ఏమో డాలీ కూడా ధీక్ష ను ఓకే చేశారు. గోపాల గోపాల చిత్రంలో సన్యాసిని పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు అమ్మడి కీర్తికిరీటంలోకి చేరింది.

టాలీవుడ్‌ స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ నిర్మిస్తున్న 'శంకరాభరణం' చిత్రంలో దీక్షా పంథ్‌ కి సెకండ్‌ లీడ్‌ లో నటించే అవకాశం దక్కింది. ఓ ఎన్నారై గాళ్‌ పాత్రలో నటిస్తోంది ధీక్ష. డెబ్యూ దర్శకుడు ఉదయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్‌ హీరో గా నటిస్తున్నాడు. అతడి సరసన నందిత ప్రధాన నాయిక.  ఇప్పుడు ఎన్నారై గాళ్‌ పాత్రలో ధీక్ష ఎంట్రీ ఇస్తోంది. ఇదే చిత్రంలో బీహార్‌ దొంగల ముఠా కీలకసభ్యురాలిగా అంజలి ఓ మెరుపు లాంటి పాత్రలో నటిస్తోంది. మొత్తానికి జూనియర్‌ ఉదయభానులా కనిపించే ధీక్షా సేథ్‌ నెమ్మదికి కెరీర్‌ గ్రాఫ్‌ ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.
Tags:    

Similar News