మోహన్ బాబుకు చిరు సలహా

Update: 2017-02-20 15:18 GMT
విలక్షణ నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. భుజం వద్ద విపరీతమైన నొప్పితో బాధ పడుతున్నారు. గతంలో ఇలాంటి సమస్యే మెగాస్టార్ చిరుకు ఎదురైంది. ఆయన ముంబయిలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్ తర్వాత చిరు కోలుకున్నారు.

మోహన్ బాబు ఎదుర్కొంటున్న సమస్య గురించి తెలుసుకున్న మెగాస్టార్.. ఆయన్ను వెంటనే బీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లాలనని సలహాఇవ్వటంతో పాటు.. తనకు జరిగిన శస్త్రచికిత్స గురించి వివరాలు చెప్పారట. చిరు సలహాతో మోహన్ బాబు ఫ్యామిలీ ముంబయికి వెళుతున్నట్లు తెలుస్తోంది. చిరుకు గతంలో ఏ విధంగా అయితే.. శస్త్రచికిత్స చేస్తారో.. అదే రీతిలో ఆపరేషన్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత మోహన్ బాబు దాదాపు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మోహన్ బాబుకు జరగనున్న శస్త్రచికిత్స కోసం ఆయనతో పాటు.. వారికుటుంబ సభ్యులంతా ముంబయికి వెళుతున్నారు. తాజాగా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తెలుగు – తమిళ్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆసుపత్రిలో తండ్రికి సాయంగా ఉండటం కోసం షూటింగ్ కు సెలవు తీసుకొని మరీ ముంబయి వెళుతున్నారు. మోహన్ బాబు ఆరోగ్య సమస్య తీరిపోయి.. ఆయన క్షేమంగా వచ్చేసి.. ఎప్పటిలానే హుషారుగా ఉండాలని కోరుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News