ముంబయ్ లో బాహుబలి సెట్ పీకేశారు

Update: 2017-04-27 16:12 GMT
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ పెరిగిపోయింది. ముందు రోజు రాత్రి నుంచే స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ రావడంతో.. హంగామా పీక్ స్టేజ్ కి చేరిపోయింది. అయితే.. మనకి ఇలా ప్రీమియర్లు వేయాలని జస్ట్ 24 గంటల ముందు మాత్రమే డిసైడ్ చేశారు.

అంతకు ముందే హిందీ వెర్షన్ బాహుబలి2కి ప్రీమియర్ ప్రదర్శించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాడు నిర్మాత కరణ్ జోహార్. ప్రీమియర్ ప్రదర్శించే ప్రాంతంలో భారీ సెట్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అనుకోకుండా సీనియర్ నటుడు సూపర్ స్టార్ వినోద్ ఖన్నా మరణించారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆయన.. ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో ముంబైలో తలపెట్టిన ప్రీమియర్ షోను రద్దు చేసుకున్నాడు కరణ్ జోహార్. ఆయన స్మృతిగానే ఇలా ప్రీమియర్ ను రద్దు చేస్తున్నామని వెల్లడించాడు.

ఇకపోతే బాలీవుడ్ లో ప్రీమియర్ వేసే ముంబయ్  ధియేటర్ దగ్గర ఏకంగా బాహుబలి కటౌట్లు.. అవీ ఇవీ చాలా పెట్టేశారు. అవన్నీ ప్రీమియర్ కోసం వేసిన సెట్టింగులట. ఎలాగో ప్రీమియర్ రద్దయ్యింది కాబట్టి.. ఆ సెట్టింగులన్నీ కూడా పీకేశారు. రేపు ఎలాగో సాధారణ జనాలు చూస్తారుగా.. వారి కోసం ఉంచేయొచ్చుగా అంటే.. అక్కడి ధియేటర్ యాజమాన్యం అందుకు నో అని చెప్పిందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News