మెగా హీరోకు మండుకొచ్చింది

Update: 2018-06-22 08:01 GMT
మెగా హీరోలు పబ్లిక్ గా బరస్ట్ అయిన సందర్భాలు తక్కువగా ఉంటాయి. అందుకే ఎప్పుడో ఒకసారి చిరంజీవి సీరియస్ అయినా సరే.. అది పెద్ద ఇష్యూగా మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. వీలైనంత వరకూ వివాదాలను అవాయిడ్ చేసేందుకు ప్రయత్నిస్తారు మెగా ఫ్యామిలీ అంతా.

అయితే.. ఎంత కంట్రోల్ చేసుకున్నా వాళ్లు కూడా మనుషులే కదా. కట్టలు తెచ్చుకుంటే ఏ భావాన్ని అయినా కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఆగ్రహమో.. ఆవేదనో.. ఆవేశమో చెప్పలేం కానీ.. ఇప్పుడు అల్లు శిరీష్ అలాంటి ఫీలింగ్ నే వెళ్లగక్కాడు. అది కూడా సోషల్ మీడియా సాక్షిగా ఓ కార్పొరేట్ కంపెనీపై కావడం మరీ విచిత్రం. ఇతడు ఇప్పటివరకూ ఎయిర్టెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడట. మరి ఆ కంపెనీ సర్వీసులు నచ్చకో.. లేక ఛేంజ్ కోసమో చెప్పలేం కానీ.. వోడాఫోన్ కు మారాడట శిరీష్. అయితే.. ఇక్కడ కూడా ఇతడికి శాటిస్ఫాక్షన్ కలగలేదు.

పైగా ఆ కంపెనీ సర్వీసులు మరింత విసుగు తెప్పించేసినట్లుగా ఉన్నాయి. 'ఏదైనా దూరమైతే కానీ దాని విలువ అర్ధం కాదు. రీసెంట్ గా నేను ఎయిర్టెల్ నుంచి వోడాఫోన్ కి మారాను. మారిన తర్వాత బ్యాడ్ ను వరస్ట్ కు మారానని అర్ధమైంది. 4జీ సంగతేమో కానీ.. కనీసం 2జీ కూడా పని చేయడం లేదు. కాల్ డ్రాపింగుల వరకు ఎందుకు.. సిగ్నల్ కూడా ఉండడం లేదు' అంటూ ట్విట్టర్ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశాడు అల్లు శిరీష్.
Tags:    

Similar News