అఖిల్‌ ఆటో డ్రైవర్‌ అయ్యాడు

Update: 2016-02-10 03:55 GMT
ఇక మంచు లక్ష్మి యాంకర్‌ గా 'జెమిని టివి' వారు తీస్తున్న కొత్త రియలిస్టిక్‌ ప్రోగ్రామ్‌ ''మేము సైతం'' కాన్సెప్టు అనేది ఏంటో తెలియదు కాని.. ఈ కార్యక్రమం కోసం వివిధ సెలబ్రిటీలు మాత్రం రకరకాల ఆమ్‌ జనతా అవతారాలు ఎత్తేస్తున్నారు.

ముందుగా ఈ ప్రోగ్రాం కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. కూకట్‌ పల్లి కూరగాయల మార్కెట్‌ లో ఒక రైతు అవతారం ఎత్తింది. ఆమె కూరగాయలు అమ్మడం ఏమోగాని.. అభిమానులు మాత్రం అవాక్కయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి చెందిన రెండో ఎపిసోడ్‌ నిన్న కమ్మం లో షూట్‌ చేశారు. ఈసారి అఖిల్‌ వంతొచ్చింది. కుర్రాడికి యూత్‌ లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా.. మనోడ్ని ఏకంగా ఆటో డ్రైవర్‌ చేశారట. ఏకంగా నిజంగానే ప్యాసింజర్లను ఎక్కించుకుని.. ఆటో నడిపి.. వారి దగ్గర పైకం కూడా తీసుకున్నాడట అఖిల్‌. అసలు ఈ ప్రోగ్రాం కాన్సెప్టు ఏంటో తెలియట్లేదు కాని.. వింటుంటేనే ఫుల్‌ కిక్కిస్తోంది.

ఇప్పటివరకు కేవలం ఎంటర్‌ టైనింగ్‌ షో లు మాత్రమే చేసిన మంచు లక్ష్మి.. ఇప్పుడు హృదయాలను కదిలించే ఒక ప్రోగ్రాంతో రాబోతోంది అనమాట. వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    

Similar News