మొత్తానికి చాలా రోజుల తరువాత దర్శకనిర్మాత కరణ్ జోహార్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండుంటాడు. ఎందుకంటే ఈ నెల 28న రిలీజ్ అవుతున్న ''ఏ దిల్ హై ముష్కిల్'' విషయంలో ఇప్పుడు రెండు అద్భుతాలు జరిగాయి. సినిమాలోపల మనోడు ఏమన్నా మార్పులు చేర్పులు చేశాడో లేదో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం కరణ్ కు చల్ల చల్లని కబుర్లు అందుతున్నాయి.
ఈ సినిమాను ధియేటర్లలో ఆడనివ్వబోం అంటూ మహారాష్ట్రలో ఎం.ఎన్.ఎస్ వార్నింగ్ ఇవ్వడం.. అలాగే చాలా రాష్ట్రలంలో కూడా ధియేటర్ల యాజమాన్యాలు సినిమాలో పాక్ నటులు ఉన్నందున సినిమాను రిలీజ్ చేయం అని చెప్పడంతో.. కరణ్ జోహార్ పెద్ద ఇబ్బందుల్లోనే పడ్డాడు. అయితే ఈరోజు ఈ సినిమా తరుపున దర్శకనిర్మాత ముకేష్ భట్ హోం మంత్రి రాజనాథ్ సింగ్ ను కలవడంతో.. ఆయన సినిమా రిలీజ్ కు ఎటువంటి ఆటంకం రాకుండా సెక్యురిటీ కల్పిస్తాం అని ఆయన ఒట్టేశారట. దానితో ఏ దిల్ హయ్ ముష్కిల్ టీమ్ అంతా ఫుల్ ఖుషీ.
ఇకపోతే నిన్నటివరకు లండన్ లో యురోప్ లో షారూఖ్ ఖాన్ తో ''రింగ్'' సినమా కోసం రొమాన్స్ చేస్తున్న అనుష్క శర్మ.. ఇప్పుడు ప్రమోషన్లలో పాల్గొనడానికి వారం ముందు రంగంలోకి దిగింది. ఇంకేముంది.. రేపటి నుండి రణబీర్ అండ్ అనుష్కలు దంచిపాడేస్తారు. పైగా ఐశ్వర్య రాయ్ కూడా వారితో జాయిన్ అవుతుందట. సో కరణ్ కు అలా రెండు విధాలుగా మంచే జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
ఈ సినిమాను ధియేటర్లలో ఆడనివ్వబోం అంటూ మహారాష్ట్రలో ఎం.ఎన్.ఎస్ వార్నింగ్ ఇవ్వడం.. అలాగే చాలా రాష్ట్రలంలో కూడా ధియేటర్ల యాజమాన్యాలు సినిమాలో పాక్ నటులు ఉన్నందున సినిమాను రిలీజ్ చేయం అని చెప్పడంతో.. కరణ్ జోహార్ పెద్ద ఇబ్బందుల్లోనే పడ్డాడు. అయితే ఈరోజు ఈ సినిమా తరుపున దర్శకనిర్మాత ముకేష్ భట్ హోం మంత్రి రాజనాథ్ సింగ్ ను కలవడంతో.. ఆయన సినిమా రిలీజ్ కు ఎటువంటి ఆటంకం రాకుండా సెక్యురిటీ కల్పిస్తాం అని ఆయన ఒట్టేశారట. దానితో ఏ దిల్ హయ్ ముష్కిల్ టీమ్ అంతా ఫుల్ ఖుషీ.
ఇకపోతే నిన్నటివరకు లండన్ లో యురోప్ లో షారూఖ్ ఖాన్ తో ''రింగ్'' సినమా కోసం రొమాన్స్ చేస్తున్న అనుష్క శర్మ.. ఇప్పుడు ప్రమోషన్లలో పాల్గొనడానికి వారం ముందు రంగంలోకి దిగింది. ఇంకేముంది.. రేపటి నుండి రణబీర్ అండ్ అనుష్కలు దంచిపాడేస్తారు. పైగా ఐశ్వర్య రాయ్ కూడా వారితో జాయిన్ అవుతుందట. సో కరణ్ కు అలా రెండు విధాలుగా మంచే జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/