Begin typing your search above and press return to search.

ఆసీస్ తో టీమిండియా టీ20 సిరీస్.. జట్టు ఇదే

ఆసీస్ తో తలపడే టీ20 టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండట్లేదు

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:01 AM GMT
ఆసీస్ తో టీమిండియా టీ20 సిరీస్.. జట్టు ఇదే
X

కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ ముగియటం.. అంచనాలకు భిన్నంగా భారత్ మీద ఆసీస్ విజయం సాధించటం.. ప్రపంచకప్ టోర్నీకి తీసుకెళ్లిపోవటం తెలిసిందే. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో మంట రేపిన ఈ గాయం నుంచి బయటకు రాక ముందే.. ప్రపంచకప్ ఫైనల్ లో ఓడిన ఆసీస్ తో టీ20 సిరీస్ షురూ కానుంది. ఈ నెల 23 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ కు సంబంధించిన టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ.

ఆసీస్ తో తలపడే టీ20 టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండట్లేదు. దీంతో.. అతనికి బదులుగా సూర్యకుమార్ కు సారధ్య బాధ్యతల్ని అప్పజెప్పింది. ఇక.. వైస్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. మొత్తం ఐదు మ్యాచ్ ల సిరీస్ కు చివరి రెండు మ్యాచ్ లకు మాత్రం శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

తొలి మ్యాచ్ నవంబరు 23న విశాఖపట్నం వేదికగా షురు కానుంది. రెండో మ్యాచ్ నవంబరు 26న తిరువనంతపురం.. మూడో మ్యాచ్ నవంబరు 28న గౌహతిలోనూ.. డిసెంబరు ఒకటిన రాయపూర్ లో.. చివరి మ్యాచ్ ను డిసెంబరు 3న బెంగళూరులో జరగనుంది. మొత్తం ఐదు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో దక్షిణాది రాష్ట్రాల్లో జరగనుండటం గమనార్హం. ఇక.. జట్టు విషయానికి వస్తే..

- సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్)

- రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్)

- శ్రేయస్ అయ్యర్

- ఇషాన్ కిషన్

- యశస్వి జైశ్వాల్

- తిలక్ వర్మ

- రింకూ సింగ్

- జితేశ్ శర్మ (వికెట్ కీపర్)

- వాషింగ్టన్ సుందర్

- అక్షర్ పటేల్

- శివమ్ దూబె

- రవి బిష్ణోయ్

- అర్షదీప్ సింగ్

- ప్రసిద్ధ్ క్రిష్ణ

- అశేశ్ ఖాన్

- ముకేశ్ కుమార్