Begin typing your search above and press return to search.

అర్జున అవార్డుకు షమి పేరు సిఫారసు

మన దేశంలో ఖేల్‌రత్న తర్వాత అర్జున అవార్డు రెండో అత్యున్నత క్రీడా పురస్కారం. ఈ అవార్డులను ప్రతీ ఏటా ప్రదానం చేస్తారు. కేంద్ర మంత్రిత్వ శాఖ 12 మంది సభ్యుల కమిటీని అవార్డుల ఎంపికకు ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 5:20 PM GMT
అర్జున అవార్డుకు షమి పేరు సిఫారసు
X

ఇటీవల స్వదేశంలో ముగిసిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరి ఓడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మెగా టోర్నీలో భారత ఏస్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ మాత్రం రికార్డు ప్రదర్శనలతో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టించాడు. మొదటి 4 మ్యాచ్ లలో అవకాశం దక్కలేదని నిరాశ చెందని షమి...ఆ తర్వాత అడిన 7 మ్యాచ్ లలో సత్తా చాటి 24 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్ కప్ లో భారత్ తరఫున 7/57 అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్ గా నిలిచాడు.

3 మ్యాచ్‌ల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా షమీని ఈ ఏడాది అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిందట. ముందుగా పంపిన జాబితాలో షమి పేరు లేదు. మన దేశంలో ఖేల్‌రత్న తర్వాత అర్జున అవార్డు రెండో అత్యున్నత క్రీడా పురస్కారం. ఈ అవార్డులను ప్రతీ ఏటా ప్రదానం చేస్తారు. కేంద్ర మంత్రిత్వ శాఖ 12 మంది సభ్యుల కమిటీని అవార్డుల ఎంపికకు ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతోపాటు ఆరుగురు మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు ఈ కమిటీలో ఉన్నారు. మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా, బ్యాడ్మింటన్ ప్లేయర్ త్రిప్తి ముర్గుండే మరియు పవర్‌లిఫ్టర్ ఫర్మాన్ పాషా కూడా ప్యానెల్‌లో ఉన్నారు. మరోవైపు, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు.