18 ఏళ్ల కల.. నెరవేరిన వేళ.. వీడియో క్షణాలు చూడాల్సిందే
(ఈసారి కప్పు మాదే) – ఈ నినాదం ఐపీఎల్ ప్రారంభం కాగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.
By: Tupaki Desk | 4 Jun 2025 9:21 AM IST(ఈసారి కప్పు మాదే) – ఈ నినాదం ఐపీఎల్ ప్రారంభం కాగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ప్రతి సీజన్ ముగిసిన తర్వాత "ఈ సాలా నమ్దు" అని గర్వంగా చెప్పుకోవాలని వారు ఆశిస్తారు. కానీ గత సీజన్ వరకు వారి ఆశలు నెరవేరలేదు.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి దిగ్గజ జట్లు చెరో ఐదు కప్పులు గెలుచుకోగా, ఆదరణలో వారికి ఏమాత్రం తీసిపోని ఆర్సీబీ మాత్రం గత సీజన్ వరకు ఒక్క ట్రోఫీని కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్లోకి అడుగుపెట్టిన మొదటి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ సైతం కప్పు గెలిచినప్పటికీ, ఆర్సీబీ మాత్రం ఎంత ప్రయత్నించినా విజేతగా నిలవలేకపోవడం ఆశ్చర్యమే.అసలు ఆర్సీబీ జట్టు ఎప్పుడూ బలహీనంగా ఉందనో లేదా బాగా ఆడలేదనో కాదు. అనేక సీజన్లలో అద్భుతంగా ఆడింది. మూడుసార్లు ఫైనల్కు కూడా చేరింది. కానీ కప్పును మాత్రం అందుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ ఆటగాడిగా, కెప్టెన్గా కప్పు కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు. కానీ ప్రతిసారీ నిరాశే మిగిలింది.
ఈ సీజన్కు రజత్ పాటిదార్ను కెప్టెన్గా ప్రకటించినప్పుడు అభిమానుల్లో నిట్టూర్పులే వినిపించాయి. మెగా వేలం తర్వాత జట్టును చూసినప్పుడు అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. దీంతో ఈ సీజన్లో కూడా కప్పు కల నెరవేరడం కష్టమే అని అభిమానులు అనుకున్నారు.
కానీ ఈసారి, వారి ఆశ ఎట్టకేలకు నెరవేరింది. "ఈ సాలా కప్ నమ్దు" నినాదాలతో ఐపీఎల్ హోరెత్తిపోతోంది!
18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల కల నెరవేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం జట్టు అభిమానుల హృదయాలను హత్తుకుంది. ఈ అద్భుత ఘట్టానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఈ ఏడాది ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పాటీదార్ అద్భుత నాయకత్వంతో జట్టును ముందుండి నడిపించారు. ట్రోఫీ అందుకోవడం ద్వారా ఆయన ఆర్సీబీ చరిత్రలో ఐపీఎల్ గెలిచిన తొలి కెప్టెన్గా నిలిచారు. పాటీదార్ తన జట్టుతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ట్రోఫీని జయద్వజంగా ఎత్తిపట్టాడు.
ఈ సందర్భంగా పాటీదార్, ఆ ట్రోఫీని వెంటనే విరాట్ కోహ్లీకి అప్పగించడం హృద్యంగా మారింది. కోహ్లీ –ఆర్సీబీకి వెన్నెముకలా నిలిచి, ఎన్నో సంవత్సరాలుగా తన మానవీయత, పట్టుదలతో జట్టును ముందుకు నడిపించిన యోధుడు. ఎన్నో ఆశలతో, ఎన్నో విఫలాల అనంతరం కోహ్లీ ట్రోఫీని తొలిసారి ఎత్తిన దృశ్యం అభిమానులకు కన్నీళ్ల కలగలుపుతో కూడిన సంతోషాన్ని తెచ్చింది.
ఆర్సీబీ జట్టు , అభిమానులు చాలా కాలంగా ఈ ఘనత కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో టైటిళ్ల సమీపంలో నిలబడి చివరికి జారిపోయిన జట్టుకు ఈ విజయం ఒక కలసిపోయిన కలల వలె. జట్టు సభ్యుల ఆనందం, అభిమానుల గర్వభావం ఈ విజయాన్ని మరింత విలువైనదిగా మార్చింది.
ఈసాలా కప్ నమదే అనే నినాదం నిజమైంది. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి, ఆర్సీబీ చివరికి ఐపీఎల్ విజేతగా అవతరించింది!
