Begin typing your search above and press return to search.

గ్రౌండ్ క్లోజ్..ఆటగాళ్లూ వచ్చేయండి..పాక్ క్రికెట్ లీగ్ క్యాన్సిల్?

భారత్ చేపడుతున్న క్షిపణి దాడులతో పాకిస్థాన్ లోని స్టేడియాలను మూసివేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతోంది.

By:  Tupaki Desk   |   8 May 2025 5:04 PM IST
గ్రౌండ్ క్లోజ్..ఆటగాళ్లూ వచ్చేయండి..పాక్ క్రికెట్ లీగ్ క్యాన్సిల్?
X

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పాకిస్థాన్ క్రికెట్ కు గట్టిగానే తగిలినట్లుంది. ఇప్పటికిప్పుడు ఆ దేశంలో క్రికెట్ మ్యాచ్ లు రద్దు అయిపోయాయి... అదేంటి? అసలు పాకిస్థాన్ లో క్రికెట్ జరుగుతోందా? విదేశీ జట్లు పర్యటిస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోందా? ఎందుకు జరగదు..? రెండు నెలల కిందట కూడా చాంపియన్స్ ట్రోఫీ జరిగిందిగా?

ఇప్పుడు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ ను నిలువునా వణికిస్తోంది. నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది భారత్. దీంతో ఆ దేశంలోని స్టేడియాలను మూసివేయాల్సిన పరిస్థితి.

భారత్ చేపడుతున్న క్షిపణి దాడులతో పాకిస్థాన్ లోని స్టేడియాలను మూసివేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతోంది. మన ఐపీఎల్ తరహాలోనే ఇదీ టి20 లీగ్.

ఈ లీగ్ వాస్తవానికి ఇప్పటికే ముగియాల్సి ఉంది. కానీ, చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా వాయిదా పడింది. ఇక గురువారం పీఎస్ఎల్ లో భాగంగా పెషావర్ జాల్మి-కరాచీ కింగ్స్ మధ్య రావల్పిండిలో మ్యాచ్ జరగనుంది.

పీఎస్ఎల్ లో మొత్తం 34 మ్యాచ్ లకు గాను ఇది 27వ మ్యాచ్. శుక్రవారం కూడా ఇక్కడ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ఆటగాళ్లందరినీ రావల్పిండి నుంచి వచ్చేయాలని పాకిస్థాన్ క్రికెటో బోర్డు కోరింది.

రావల్పిండి నగరం భారత్ కు దగ్గరలోనే ఉంటుంది. 1959 నుంచి పదేళ్ల పాటు పాకిస్థాన్ కు రెండో రాజధాని కావడం గమనార్హం.

పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం రావల్పిండిలోనే ఉంది. దీంతోనే ముందస్తు చర్యగా దేశంలో అన్ని క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణను నిలిపివేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహణ కూడా కష్టమే అని భావింవచ్చు. భారత్ దాడుల తీవ్రత ఎక్కువైతే లీగ్ ను రద్దు చేసే అవకాశం లేకపోలేదు.