Begin typing your search above and press return to search.

ఐపీఎల్ రద్దు.. మరి పీఎస్ఎల్?.. భారత్ దెబ్బకు దివాలానేనా?

ఇక పీఎస్ఎల్ ను నిర్వహించే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురించి చెప్పేదేముంది..? ఎప్పుడో దివాలా తీసిన బోర్డు ఇది.

By:  Tupaki Desk   |   9 May 2025 3:07 PM IST
PSL Struggles as Tensions Escalate
X

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను చూసి పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను మొదలుపెట్టింది పాకిస్థాన్. కానీ, రెండింటికీ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ లో ఒక్క ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అంత విలువ కూడా చేయదు పీఎస్ఎల్. అంతేకాదు.. ఐపీఎల్ లో అమ్ముడుపోని, పనికిరారని వదిలేసినవారే పీఎస్ఎల్ లో ఆడుతుంటారు.

ఇక పీఎస్ఎల్ ను నిర్వహించే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురించి చెప్పేదేముంది..? ఎప్పుడో దివాలా తీసిన బోర్డు ఇది. అందుకనే.. పీఎస్ఎల్ నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ పేరిట ఐసీసీ టోర్నీని నిర్వహించినా దానితో పెద్దగా లాభపడిందీ లేదు.

ఇప్పుడు యుద్ధం కమ్ముకుంటున్న స్థితిలో భారత్ ముందు జాగ్రత్తగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేసింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ కారణంగా పీఎస్ఎల్ నిర్వహణ వాయిదా పడింది. మ్యాచ్ లను దుబాయ్ కి మార్చేశారు. దీనిపై షెడ్యూల్ వెలువడాల్సి ఉంది.

భారత్ దాడులు చేస్తుండడంతో రావల్పిండిలో గురువారం జరగాల్సిన పీఎస్ఎల్ మ్యాచ్ ను రద్దు చేసింది. ఇప్పటికే పీఎస్ఎల్ లోని విదేశీ ఆటగాళ్లు భయం, ఆందోళనతో ఉన్నారు. స్వదేశానికి వెళ్లే ఆలోచనలో తమ ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నారు.

పీఎస్ఎల్ ప్రస్తుతం 10వ సీజన్ లో ఉంది. అంటే ఐపీఎల్ కంటే 8 సీజన్లు వెనుక. పీఎస్ఎల్ మ్యాచ్ లు జరుగుతున్న స్టేడియాలు భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి పీఎస్ఎల్ ను రద్దు చేయక తప్పదు. తద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దివాలా తీయడం ఖాయం.

వాస్తవానికి ఆరు జట్లు పాల్గొనే పీఎస్ఎల్ కారణంగా పాకిస్థాన్ బోర్డు సంపాదిస్తున్నది ఏమీ లేదు. పైగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ఫ్రాంచైజీకి ఎక్కువ వాటా ఇవ్వడమే దీనికి కారణం. మొత్తమ్మీద పాకిస్థాన్ రూపాయిల్లో రూ.1,637.977 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పీసీబీ, ఫ్రాంచైజీల మధ్య పదేళ్ల ఒప్పందం ఉంది. ఇది ఈ ఏడాదితో పూర్తికానుంది. ఆ తర్వాతే ఒప్పందంలో మార్పులు చేయడానికి అనుమతి ఉంటుంది.

ఐదో సీజన్ నుంచే పీఎస్‌ఎల్ నష్టాలను చవిచూస్తోంది. మీడియా హక్కుల్లో ఫ్రాంచైజీ వాటాను 80 శాతానికి పెంచారు. మిగిలిందే పీసీబీకి వసోతంది. స్పాన్సర్‌ షిప్ హక్కులలో 40 శాతం ఫ్రాంచైజీవే. టికెట్ల అమ్మకాలలో కూడా 90 శాతం ఫ్రాంచైజీలకే.