విమానం సీట్లో కూర్చుని.. కాల్పుల విరమణతో కిందకు దిగిన పాంటింగ్
ఉపఖండంలోని శ్రీలంక జట్టు ఆటగాళ్లకు ఇబ్బంది లేకున్నా.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన క్రికెటర్లకు యుద్ధం అంటే ఏమిటో తెలియదు.
By: Tupaki Desk | 11 May 2025 8:30 PMభారత్-పాకిస్థాన్ యుద్ధం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వారం పాటు వాయిదా పడింది.. ఆపై మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి.. దీంతో విదేశీ ఆటగాళ్లకు ఎటూ పాలుపోలేదు. దీంతో తట్టాబుట్ట సర్దుకుని విమానం టికెట్ బుక్ చేసుకున్నారు.
ఉపఖండంలోని శ్రీలంక జట్టు ఆటగాళ్లకు ఇబ్బంది లేకున్నా.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన క్రికెటర్లకు యుద్ధం అంటే ఏమిటో తెలియదు. దశాబ్దాలుగా ఐపీఎల్ లో పాల్గొంటున్నా.. వారికి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. దీంతో తాజా పరిణామాలతో బెంబేలెత్తారు.
ఇదే విధంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కూడా విమానం టికెట్ కొనేశాడు. ప్రయాణం కూడా మొదలుపెట్టి సీట్లో కూర్చున్నాడు. అయితే, ఇంతలోనే భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిపోయినట్లు సమాచారం రావడంతో హుటాహుటిన కిందకు దిగాడు.
పాంటింగ్ కోచింగ్ ఇస్తున్న పంజాబ్ కింగ్స్ లోనే ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్ ఉన్నాడు. ఇతడితో పాటు విదేశీ క్రికెటర్లు ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, బార్ట్ లెట్ కూడా తమ దేశాలకు వెళ్లబోతున్న సంగతి తెలుసుకుని పాంటింగ్ సర్దిచెప్పాడు.
యుద్ధం ఆగిపోయిందనే సంగతి చెప్పి వారిని ఇండియాలోనే ఉండేలా చూశాడు. అయితే, అప్పటికే దక్షిణాఫ్రికాకు చెందిన 6.8 అడుగుల అత్యంత పొడగరి క్రికెటర్ మార్కో యాన్సెన్ దుబాయ్ మీదుగా వెళ్లిపోయాడు.
పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ తోనే ఐపీఎల్ మధ్యలో ఆగిపోయింది.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు ఇప్పటికే తమదేశాలకు వెళ్లిపోయారు.