Begin typing your search above and press return to search.

శ్రీవారి దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేసిన టీటీడీ !

By:  Tupaki Desk   |   20 May 2020 12:30 PM GMT
శ్రీవారి దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేసిన టీటీడీ !
X
కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమలేశుని దర్శనం కోసం ప్రతి ఒక్కరు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ఆ శ్రీవారి దర్శనం నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 60 రోజులుగా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించకపోవడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, దర్శనాలు ఎప్పుడు పున: ప్రారంభమవుతాయో ఇప్పట్లో చెప్పలేమని తెలిపారు.

ఈ నేపథ్యంలో భక్తులపై వెంకన్న ఆశీస్సులు అందించాలన్న ఉద్దేశంతో లడ్డూ ప్రసాదాలను విక్రయించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రూ.50 లడ్డూను రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మంటపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయని.. ప్రత్యేక ఆర్డర్‌ పైనా స్వామి వారి లడ్డూలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. దీనిపై మరింత సమాచారం కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ (9849575952), పేష్కార్‌ శ్రీనివాస్‌ (9701092777)ను సంప్రదించాలని ఆయన సూచించారు.

మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్ ‌డౌన్ అమల్లో ఉంటుంది అని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేయడంతో.. తిరుమలో ఇప్పట్లో భక్తులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. ఒక్కసారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వెంటనే దర్శనాలను ప్రారంభించేందుకు టీటీడీ మాత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్‌ చేయించారు. అయితే , ప్రభుత్వం నుండి ఇప్పుడప్పుడే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం మాత్రం లేదు. మొత్తంగా మే 31 తరువాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.