Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: కరోనా చికిత్స పొందుతూ గుండెపోటుతో తిరుపతి ఎంపీ మృతి

By:  Tupaki Desk   |   16 Sep 2020 4:00 PM GMT
బిగ్ బ్రేకింగ్: కరోనా చికిత్స పొందుతూ గుండెపోటుతో తిరుపతి ఎంపీ మృతి
X
కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి ఎంపీ, వైసీపీ సీనియర్ నేత బల్లి దుర్గాప్రసాద్ బుధవారం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. దుర్గాప్రసాద్ నెల రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. వెంటనే ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం దుర్గాప్రసాద్ కు ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

అయితే దుర్గాప్రసాద్ కు ఉబకాయంతో భారీ శరీరం ఉండడం.. అంతకుముందే శ్వాసకు సంబంధించి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆయన నెలరోజులుగా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. తాజాగా గుండెపోటు వచ్చి పరిస్థితి విషమించి చనిపోయారు.

దుర్గాప్రసాద్ 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయల వైపు అడుగులు వేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

నెల్లూరు జిల్లా గూడురు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా దుర్గప్రసాద్ గెలిచాడు. ఆయన 1985, 1994,1999, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 1996 నుంచి 98 వరకు మంత్రిగా చేశారు.

దుర్గాప్రసాద్ స్వస్థలం నాయుడు పేట మండలం భీమవరం. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తిరుపతి ఎంపీ మరణంతో వైసీపీలో విషాద చాయలు అలుముకున్నాయి.