Begin typing your search above and press return to search.

టీడీపీ తిట్లను మరవని వైసీపీ.. అసెంబ్లీలో ఫైటే..

By:  Tupaki Desk   |   13 Jun 2019 5:32 AM GMT
టీడీపీ తిట్లను మరవని వైసీపీ.. అసెంబ్లీలో ఫైటే..
X
ఐదేళ్లు గడిచాయి.. టీడీపీ అధికారంలో ఉన్నన్నీ నాళ్లు ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేసి ఎంత తిట్టాలో అంతా తిట్టేసింది. ఇప్పుడు వైసీపీ వంతు వచ్చేసింది. వారు ఊరుకుంటారా.? టీడీపీ గత ఐదేళ్లలో అసెంబ్లీలో తిట్టిన రికార్డు పుస్తకాలను తెప్పిస్తున్నారట.. వాటికి మరింత రంగరించి తిట్టేందుకు రెడీ అయ్యారట.. ఇది ఎవరో అన్నది కాదు... టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న మాటలివీ..

అవును టీడీపీ గడిచిన ఐదేళ్లలో వైసీపీ వాళ్లకు వాయిస్ లేకుండా చేసి వారిపై ఎన్నో ఆరోపణలు చేస్తూ తిట్ల వర్షం కురిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు - అచ్చెన్నాయుడు - గంటా - సహా మంత్రులు ఒంటికాలిపై లేచి వైసీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ పగ - ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు..

తాజాగా అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడ్డ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లకు - వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మధ్య సరదా సంభాషణ సాగింది. మీరు తిట్టిన తిట్లకు మరింత క్రీమ్ రాసి మరీ తిడుతామంటూ శ్రీధర్ రెడ్డి గోరంట్లతో అనగా.. ఆయన నవ్వి ఊరుకున్నారు.

పైకి సరదాగా కనిపిస్తున్నా గడిచిన ఐదేళ్లు మాటలు పడ్డ వైసీపీ నేతలు టీడీపీ నేతలను అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.. వైఎస్ జగన్ సహా మిగతా వారంతా వచ్చే అసెంబ్లీలో జులు విదల్చడం ఖాయంగా కనిపిస్తోంది.