Begin typing your search above and press return to search.

ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు..25 మంది సర్పంచ్ లూ చేరారు

By:  Tupaki Desk   |   9 April 2016 9:33 AM IST
ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు..25 మంది సర్పంచ్ లూ చేరారు
X
అనుకున్నదే జరిగింది. ఉగాది పండగ రోజు తినే ఉగాది పచ్చడిలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు ఈసారికి చేదు ఎక్కువేనన్న అంచనాకు తగ్గట్లే తాజాగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పండగపూట పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ అయి.. సైకిల్ ఎక్కేయటం ఖాయమన్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లే ఇద్దరు ఎమ్మెల్యేలు (పరువుల సుబ్బారావు.. సునీల్ కుమార్) తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి బాబు చేతుల మీదగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారి మెడలో కండువాలు వేసిన చంద్రబాబు.. పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే.. ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున స్థానిక నాయకుల్ని సైతం ఇరువురు ఎమ్మెల్యేలు భారీగా తీసుకొచ్చి సైకిల్ ఎక్కించేయటం గమనార్హం. పండగరోజున పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు.. పాతిక మంది సర్పంచ్ లు.. 26 మంది ఎంపీటీసీలు.. ఒక జెడ్పీటీసీ.. ఒక ఎంపీపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చూస్తుంటే.. వైఎస్ జగన్ కు పండగపూట భారీగానే దెబ్బ తగిలినట్లే.