Begin typing your search above and press return to search.

వైఎస్ భారతికి విశాఖలో ఇల్లు నచ్చలేదా?

By:  Tupaki Desk   |   6 March 2020 6:05 AM GMT
వైఎస్ భారతికి విశాఖలో ఇల్లు నచ్చలేదా?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఇటీవల విశాఖపట్నాన్ని సందర్శించారు. గతంలో విశాఖకు ఆమె పలుమార్లు వచ్చినా.. తాజా పర్యటన మాత్రం ఆసక్తికరంగా మారింది. దీని కారణం లేకపోలేదంటున్నారు. త్వరలో ఏపీ రాజధానిని విశాఖకు తరలించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నేపథ్యంలో.. విశాఖలో ఎక్కడ ఉండాలి? ఏ ఇంట్లో నివాసం ఉండాలన్న అంశానికి సంబంధించిన పని మీదనే తాజా టూర్ సాగిందని చెబుతున్నారు.
విశాఖకు వచ్చిన భారతి అప్పటికే అధికారులు కొన్ని భవనాల్ని ఎంపిక చేశారు. తాము షార్ట్ లిస్ట్ చేసిన భవనాల్ని ఆమెకు చూపించినట్లు తెలుస్తోంది. నౌకాశ్రయ గెస్ట్ హౌస్ తో పాటు.. రుషికొండలోని కొన్ని విశాలమైన భవనాల్ని చూపించారు. భీమిలిలోని జూట్ మిల్ గెస్ట్ హౌస్ ను కూడా చూపించినట్లుగా తెలుస్తోంది.

అయితే.. అధికారులు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలోని ఇళ్లు పెద్దగా ఆకట్టుకునే లా లేవన్న సమాచారం వినిపిస్తోంది. అమరావతికి సమీపంలో ప్రస్తుతం ఉన్న భవనానికి తగ్గట్లుగా విశాఖలోని భవనం ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఎంపిక చేసినవి నచ్చని నేపథ్యంలో మరిన్ని భవనాల్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా సమాచారం.