Begin typing your search above and press return to search.

మందు బాబా .. తమిళ తంబీలతో తెలుగు బాబా విన్యాసాలు

By:  Tupaki Desk   |   6 Sep 2021 5:32 AM GMT
మందు బాబా .. తమిళ తంబీలతో తెలుగు బాబా విన్యాసాలు
X
మన భారతదేశంలో డాక్టర్ల కంటే బాబాలకే ఎక్కువ క్రేజ్. ఇది జగమెరిగిన సత్యం. పేదవాడి నుండి ధనికుడి వరకు , చదువులేని వాడి నుండి బాగా చదువుకున్న వారు సైతం బాబాలకే ఓటు వేస్తారు. ఎంతో కష్టపడి చదివి , ఎన్నో పోటీ పరీక్షల్లో తన తెలివి తో పాస్ అయ్యి , డాక్టర్ వృత్తిలోకి వస్తే అతని మాటలు నమ్మరు కానీ , ఎదో ఓ చెట్టుకింద చిన్న టెంట్ వేసుకొని కూర్చొని ఉండే బాబా చెప్తే మాత్రం నమ్మేస్తారు. . మూఢనమ్మకాలన నమ్మినంత ఈజీగా సైన్స్ ని నమ్మరు. ప్రతి ఒక్కరికీ ఫ్యూచర్ గురించే ఆలోచన. జీవితంలో రేపు ఏం జరగబోతోందనే ఆత్రుత ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

దీనితో జాతకాలు చెప్తామంటూ చాలా మంది జనాల్ని మోసం చేస్తుంటారు. అలాగే అనారోగ్యం వచ్చినా, కుటుంబంలో సమస్యలు వచ్చినా డాక్టర్ వద్దకో, లాయర్ వద్దకో వెళ్లాలి కానీ, అలా కాకుండా బాబాల వద్దకు పరుగులు పెడుతుంటారు. అయితే , కొందరు బాబాలు చిత్ర విచిత్రమైన పద్ధతులతో వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు తన్నులతో దోషాలు పొగడతామంటే.. ముద్దులతో జాతకాలు చెప్తామంటూ మోసం చేస్తుంటారు. ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కువగా బాబాల వద్దకి వెళ్లి మోసపోతుంటారు.

చదువుకున్న వారిని మోసం చేయడం కొంచెం కష్టం కానీ, చదువులేని పేద వారిని మోసం చేయడం చాలా సులువు , అందుకే బాబాల టార్గెట్ కూడా పేదవారే. అలాగే పేదవారికి తమ జీవితం ఏంటి ఇలా ఉంది , ఇక మన జీవితంలో మార్పు వచ్చేది ఎప్పుడు అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకే వారిని టార్గెట్ చేసుకొని అలా చేస్తే మీ దోషం పోయి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు , కోటీశ్వరులు అవుతారు అని వారిని బాగా నమ్మిస్తారు. ఏమైనా పేదవారు నాలుగు మంచి మాటలు చెప్పగానే త్వరగా బుట్టలో పడిపోతారు.కాబట్టి బాబాలా పని కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. అందుకే ఎక్కువగా బాబాల దగ్గరకి మధ్యతరగతి , పేద వారే వస్తుంటారు. ఇక ధనవంతులు కూడా వస్తుంటారు. కానీ, పేదవారిని మోసం చేసినట్టుగా వారిని మోసం చేయలేరు.

తాజాగా తమిళనాడులో మరో బాబా వెలుగులోకి వచ్చాడు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూర్లోని టోల్ ప్లాజా సమీపంలోని నెమలి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మణి గత పదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఆ ఆయలం వద్ద పనిచేస్తూ తొలుత రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదించేవాడు. ఐతే కొన్నాళ్ల క్రితం ఆలయం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మణిబాబా అవతారమెత్తాడు. ఫ్యూచర్ చెప్తానంటూ ప్రజలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. సాధారణంగా బాబాలకు పండ్లు, పూలు, డబ్బులు, కొన్ని రకాల ఆహార పదార్ధాలు భక్తులు సమర్పిస్తుంటారు. కానీ ఈ మణి బాబా రూటే సపరేటు. కిక్ ఎక్కితే తప్ప మనోడి భవిష్యవాణి పలకదు. ఫుల్ బాటిల్ ముందుపెడితే చాలు, మీ ఫ్యూచర్ మీ చేతుల్లో పెట్టేస్తాడు. చుక్కనోట్లో పడితే జరిగింది. జరుగుతుంది. జరగబోయేది, మొత్తం చెప్పేస్తాడు.

బాబా కదా, ఎత్తిన బాటిల్ దించకుండా తాగేస్తాడు. అంతేకాదు అక్కడుకు వచ్చిన కొందరు భక్తులు బాబా ఇచ్చిన మందును తీర్థంలాగా స్వీకరిస్తారు.మందు కొడుతున్నాడు... భక్తులకు పోస్తున్నాడు. ఇతను బాబా ఏంటని అనుకుంటున్నారు. ఈ మణి బాబా దగ్గరకు భక్తులు క్యూ కడుతున్నారు. మందు మత్తులో నిజంగానే ఫ్యూచర్ చెబుతున్నాడని నమ్మి ఆతని ఆశ్రమానికి పరుగులు పెడుతున్నారు. బాబా దగ్గరకు పురుషులతో పాటు మహిళలు కూడా ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నారట. అంతేకాదు అతడి ఆశ్రమ వద్ద కార్లు బారులు తీరుతున్నాయి. మరి ఈ బాబా చెప్పే జ్యోతిష్యంలో ఎంత నిజముందోకానీ.. అశ్రమంలో మాత్రం లిక్కర్ ఏరులై పారుతోంది. ఏదేమైనా ప్రజలు ఇలాంటి బాబాలని నమ్మినంత కాలం ఎంతమంది బాబాలు వెలుగులోకి వచ్చినా వారికొచ్చిన డోఖానేలేదు.