Begin typing your search above and press return to search.

ప్రేమకు నో చెప్పిందని గొంతు కోసేశాడు

By:  Tupaki Desk   |   9 May 2020 10:30 PM GMT
ప్రేమకు నో చెప్పిందని గొంతు కోసేశాడు
X
ఎవరి ఇళ్లల్లో వారుండే ప్రత్యేక పరిస్థితుల్లోనూ కొన్ని అఘాయిత్యాలు ఆగటం లేదు. మొన్నటివరకూ బాగానే ఉన్నట్లుగా కనిపించినా.. కొద్ది రోజులుగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మద్యం దుకాణాలు.. ఇతర షాపుల్ని తెరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో.. రోడ్ల మీద జనసంచారం కనిపించటమే కాదు.. వాహనాల రద్దీ కూడా పెరిగింది.

ఇదే సమయంలో నేరాల సంఖ్య పెరగటం షురూ అయ్యింది. తాజాగా ప్రేమ వేధింపులకు గురి చేసిన ఒక యువకుడి కారణంగా.. ఒక అమ్మాయి ప్రాణాల కోసం పోరాడుతోంది. ఏపీలోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.

ఆటోడ్రైవర్ గా పని చేసే 21 ఏళ్ల రామాంజనేయులు.. ఊరికి చెందిన పద్నాలుగేళ్ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. పదో తరగతి చదివే ఆ అమ్మాయి.. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. పేద కుటుంబం కావటంతో.. తల్లిదండ్రులు పొద్దున్నే పనికి వెళుతుంటారు. ఈ విషయాన్ని గుర్తించిన అతను.. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు వారింటికి వెళ్లాడు.

తానుప్రేమిస్తున్నానని.. తనను ప్రేమించాలని కోరారు. అందుకు ఆ బాలిక నో చెప్పింది. దీంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ప్రేమిస్తుంటే.. తన ప్రేమకు నో చెప్పిన వైనంతో సహనం కోల్పోయిన రామాంజనేయులు తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో ఆ అమ్మాయి గొంతు కోశాడు. అనుకోని పరిణామంతో షాక్ తిందా బాలిక. తీవ్రమైన రక్తస్రావాన్ని చూసిన రామాంజనేయులు భయంతో అక్కడినుంచి పారిపోయాడు. జరిగిన దారుణాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు వారు.. ఆ బాలికనుఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రామాంజనేయులుకోసం వెతుకుతున్నారు.