Begin typing your search above and press return to search.

రాష్ట్రానికి ఆదాయాన్నిస్తున్న మందుబాబులకు పాదాభివందనం

By:  Tupaki Desk   |   2 Jun 2020 10:10 AM GMT
రాష్ట్రానికి ఆదాయాన్నిస్తున్న మందుబాబులకు పాదాభివందనం
X
వైసీపీ ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకుంది. సంబరాలు చేసుకుంటోంది. అన్ని వర్గాలను టచ్ చేస్తున్న సర్కార్ మందు బాబులకు మాత్రం విస్మరిస్తోందని ఓ టీడీపీ నేత చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మందుబాబులను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని రైల్వేకోడూరు టీడీపీ నేత నరసింహప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు. ఏకంగా మందు బాబులకు సన్మానించడం వైరల్ గా మారింది.

రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం పంచాయితీలోని మద్యం దుకాణం వద్దకు చేరుకున్న టీడీపీ నేత నరసింహప్రసాద్ మందుబాబులకు లుంగి, టవల్, యాపిల్ పండు ఇచ్చి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.

అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ రూ.50 ఉండేదని.. ప్రస్తుతం రూ.200 విక్రయిస్తున్నారని.. ప్రభుత్వాన్ని పోషిస్తున్న మీకే సన్మానం చేసుకునే అర్హత ఉందని టీడీపీ నేత ఈ పనిచేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు చెమటను, రక్తాన్ని దారపోస్తున్న మందుబాబులకు నిజంగానే పాదాభివందనం చేశారు సదురు టీడీపీ నేత. ఈ నేత చేసిన పని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.