Begin typing your search above and press return to search.

న్యూయార్క్ లో 'టైమ్స్ స్క్వేర్' వద్ద 3 వేలమందితో యోగా…!

By:  Tupaki Desk   |   21 Jun 2021 10:30 AM GMT
న్యూయార్క్ లో  టైమ్స్ స్క్వేర్ వద్ద  3 వేలమందితో యోగా…!
X
ఈ రోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద అమెరికా సమయం ప్రకారం నిన్న జరిగిన యోగా సెలబ్రేషన్స్ లో 3 వేలమందికి పైగా ప్రజలు పాలుపంచుకున్నారు. రోజు మొత్తం జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా తెలిపారు. తమ తమ యోగా మ్యాట్స్ తెచ్చుకుని వీరంతా పార్టిసిపేట్ చేయడం అభినందనీయమని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందని, ఇండియాలో పుట్టిన యోగా గ్లోబల్ హెరిటేజ్ గా మారిందని ఆయన తెలిపారు.

ఇది ఆరోగ్యానికి, సంక్షేమానికి, ప్రకృతితో మమేకమై జీవించడానికి తోడ్పడుతుందన్నారు. శాంతియుత సమాజం కోసం, పచ్చని భూతలం కోసం ఇది దోహదపడుతుందని, మానవాళి ఆరోగ్యం దీనిపై ఆధార[పడి ఉందని ఆయన చెప్పారు. యోగా ఈజ్ వే ఆఫ్ లైఫ్ అన్నారు. శరీరానికి, మనసుకు సాంత్వన కలిగించే యోగాను అందరూ పాటించాలని జైస్వాల్ సూచించారు. ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తున్న వేలమంది ఈ పరిసరాలను ‘పునీతం’ చేశారని..అద్భుత అనుభవం పొందారని ఈ ఈవెంట్ లో పాల్గొన్న రుచికా లాల్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరపు గ్లోబల్ థీమ్ ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రవచించిన యోగా ఫర్ వెల్ నెస్ నినాదం నేపథ్యంలో…ట్రైబ్స్ ఇండియాతో బాటు పలు భారతీయ కంపెనీలు ఏర్పాటు చేసిన ఆయుర్వేద, ప్రకృతి సహజ సిద్ధమైన వస్తువులు, ఉత్పత్తుల స్టాల్స్ ను అనేకమంది సందర్శించారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఇక్కడ 9 యోగా సెషన్స్ నిర్వహించారు. ప్రముఖ యోగా నిపుణులు ధారా నటాలీతో బాటు వివిధ భారతీయ సంఘాలు దీన్ని నిర్వహించడం విశేషం.