Begin typing your search above and press return to search.

కరోనా బారినపడ్డ మరో వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   3 Oct 2020 2:30 PM GMT
కరోనా బారినపడ్డ మరో వైసీపీ ఎమ్మెల్యే
X
ఏపీలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజుకు 6వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా బారినపడ్డారు. చాలా మందికి సోకుతూనే ఉంది. బయట కార్యక్రమాలకు హాజరైతే చాలు వైరస్ వ్యాపిస్తోంది.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. తాను ఫోన్ ద్వారా కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఇక తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కాకాని నేతలు, ప్రజలకు సూచించారు. హోం ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గింది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. శుక్రవారం ఏపీలో 6555 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 706790కి చేరింది.