Begin typing your search above and press return to search.

ఆడ‌పిల్ల‌ల‌పై వైసీపీ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   8 March 2020 8:14 AM GMT
ఆడ‌పిల్ల‌ల‌పై వైసీపీ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
X
సౌమ్యుడిగా ఉండే నేత‌గా పేరున్న వైసీపీ సీనియ‌ర్ నేత‌ - మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదంలో చిక్కుకున్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా స్థానిక డిగ్రీ కాలేజీలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మహిళల కట్టుబొట్టు సరిగ్గా ఉంటే కురాళ్లు ఎందుకు అల్లరి చేస్తారని ఆయ‌న పేర్కొన్న మాట‌లను ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌సన్న‌పేట డిగ్రీ కాలేజీలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ మాట్లాడుతూ మహిళలు సాంప్రదాయంగా ఉంటేనే గౌరవంగా ఉంటుందని పేర్కొంటూ కట్టుబొట్టు సక్రమంగా లేకపోతేనే కుర్రాళ్లు అల్లరి చేస్తారని వ్యాఖ్యానించారు. మన తప్పులు ఉంటేనే ఎవరైనా అల్లరి చేస్తారని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లంగా మారింది. మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మ‌హిళ‌ల ప‌ట్ల త‌ప్పుగా మాట్లాడార‌ని సోష‌ల్ మీడియాలో ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.