Begin typing your search above and press return to search.

ఇంట్లోకి చొరబడి మరీ.. వైసీపీ నేత దారుణ హత్య

By:  Tupaki Desk   |   24 Aug 2020 9:08 AM GMT
ఇంట్లోకి చొరబడి మరీ.. వైసీపీ నేత దారుణ హత్య
X
ప్రకాశం జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. వైసీపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు.

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని తాళ్లూరు మండలం రజానగరంలో మారం సుబ్బారెడ్డి అలియాస్ భూమిరెడ్డి సుబ్బారావు తన ఇంట్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి ప్రహరి దూకి లోపలికి వచ్చారు. తింటున్న భూమిరెడ్డి తలపై మెడపై నరికి అక్కడి నుంచి పారిపోయారు.

భార్య పనిమీద బయటకు వెళ్లగా.. వచ్చి చూసేసరికి భర్త ఒళ్లంతా రక్తంలో కుర్చీలో వాలి కనిపించాడు. భయంతో భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సుబ్బారావు గతంలో బెంగళూరులో బ్రిక్స్ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం గ్రామంలోనే దానిమ్మ తోటలను సాగు చేస్తున్నాడు. హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.