Begin typing your search above and press return to search.

పిల్లలు పుట్టలేదని , వేశ్యలని తీసుకోచ్చి శృంగారం , ఆ తర్వాత !

By:  Tupaki Desk   |   25 Oct 2021 6:29 AM GMT
పిల్లలు పుట్టలేదని , వేశ్యలని తీసుకోచ్చి శృంగారం , ఆ తర్వాత !
X
ప్రపంచం సైన్స్ పరంగా రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందింది. మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో కూడా దేశంలో ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, క్షుద్ర విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో కొందరు వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తోటి మనిషి ప్రాణాలు తీస్తున్నాడు. తాజాగా మూఢనమ్మకంతో ఓ జంట చేసిన పని అందరిని షాక్ కి గురి చేస్తుంది. మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. సంతానం కోసం ఓ జంట నరబలి ఇచ్చిన ఘటన సంచలనం రేపింది. గ్వాలియర్ లో నివసించే బంటు బదౌరియా, మమతా దంపతులకు 18 ఏళ్ల కిందట పెళ్లైంది. ఇప్పటికీ పిల్లలు కలగలేదు. వారి కుటుంబ స్నేహితుడు నీరజ్ పర్మార్ సలహా మేరకు గిర్వార్ యాదవ్ అనే భూతవైద్యుడ్ని సంప్రదించారు. పిల్లలు పుట్టాలంటే నరబలి ఒక్కటే మార్గమని అతడు చెప్పడంతో బంటు, మమత సరేనన్నారు.

బలి ఇచ్చేందుకు తగిన వ్యక్తిని తీసుకొచ్చే బాధ్యతను వారు నీరజ్ పర్మార్ కు అప్పగించారు. నీరజ్ ఓ వేశ్యను తీసుకొచ్చాడు. వారు ఆమెను బలిచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్ పై తరలించే ప్రయత్నంలో కిందపడిపోవడంతో నీరజ్ భయపడ్డాడు. దాంతో ఆ వేశ్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకొచ్చి భూత వైద్యుడి సమక్షంలో బలి ఇచ్చారు. అయితే, మొదట బలి ఇచ్చిన వేశ్య మృతదేహం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ఆరంభించగా, నరబలి వ్యవహారం బట్టబయలైంది. చనిపోయిన వేశ్య ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ద్వారా పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.

నీరజ్ పర్మార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్ లో ఎంక్వైరీ చేశారు. నీరజ్ ను నాలుగు పీకారు. అంతే, మనోడు నిజాన్ని కక్కేశాడు. దాంతో బంటు, మమతా దంపతులతో పాటు మమతా సోదరి మీరా రజావత్, భూతవైద్యుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మొదటి వేశ్యను నరబలి ఇచ్చే ముందు నీరజ్ సర్మార్ ఆమె తో శృంగారం లో పాల్గొన్నాడు. అంతేకాదు, మొదటి వేశ్య మద్యం తాగి ఉన్నందున ఆమె నరబలి చెల్లదని భూతవైద్యుడు చెప్పాడని దీంతో వారు రెండో వేశ్యను తీసుకొచ్చి నరబలి ఇచ్చారని పోలీసుల విచారణలో తేలింది.

ఓ రాత్రి తనతో గడిపేందుకు వేశ్యకు నీరజ్ రూ.10వేలు ఆఫర్ చేశాడు. వేశ్యతో అతడితో సెక్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత నరబలి ఇచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చేందుకు బైక్ పై తీసుకెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయ్యింది. మృతదేహం రోడ్డుపై పడింది. దీంతో కంగారుపడిన నిందితులు మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకొచ్చి నరబలి ఇచ్చారు. ఆ వేశ్య మృతదేహాన్ని పోలీసులు మొరేనా జిల్లాలో గుర్తించారు. రెండో వేశ్యను బలిచ్చే ముందు కూడా నీరజ్ ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు.