Begin typing your search above and press return to search.

దారుణం: అనంత ధర్మవరంలో బ్యాంక్ ఉద్యోగి కాలి బూడిదైంది

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:46 AM GMT
దారుణం: అనంత ధర్మవరంలో బ్యాంక్ ఉద్యోగి కాలి బూడిదైంది
X
ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. బ్యాంకు ఉద్యోగిని సదరు యువతి.. ఉద్యోగంలో భాగంగా బ్యాంకు వెళ్లిందే కానీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వారు.. కాలి బూడిదైన ఆమెను చూసి అవాక్కు అయ్యారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

ధర్మవరానికి చెందిన స్నేహలత స్టేట్ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిని. రోజు మాదిరే ఆమె జాబ్ కోసం ఉదయమే ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. మంగళవారం ఉదయం వెళ్లిన ఆమె.. రాత్రికి కూడా రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా స్నేహలత స్నేహితులైన రాజేశ్.. కార్తీక్ పైన వారు సందేహాన్ని వ్యక్తం చేశారు.

చాలా రోజులుగా ప్రేమ పేరుతో తమ కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక టీంలతో స్నేహలత కోసం వెతకటం షురూ చేశారు. చివరకు బుధవారం ఉదయం ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద స్నేహలత డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దారుణంగా హత్య చేసి.. అనంతరం ఆమెను తగలబెట్టేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణలోని ఈ ఉదంతం మరింత సంచలనంగా మారింది. పెళ్లి ఈడుకు వచ్చిన కుమార్తె.. అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి రావటం ఆ తల్లిదండ్రులకు ఉండే కడుపుకోత మామూలుగా ఉండదని చెప్పాలి.