Begin typing your search above and press return to search.

మహిళను గ్యాంగ్ రేప్ చేసి ముక్కలుగా నరికారు

By:  Tupaki Desk   |   13 May 2017 3:35 PM IST
మహిళను గ్యాంగ్ రేప్ చేసి ముక్కలుగా నరికారు
X
నిర్భయ కేసులో గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నలుగురు నిందితులకు సుప్రీం కోర్టు మరణ శిక్షను ఖరారు చేసి కొన్ని రోజులే అవుతోంది. ఇలాంటి తీర్పులు మానవ మృగాల్లో కొంచెమైనా మార్పు తెస్తాయని.. ఇలాంటి ఘోరాలకు పాల్పడకుండా హెచ్చరికల్లా మారుతాయని ఆశిస్తే.. ఇలాంటి తీర్పులు తమ మీద ఎంతమాత్రం ప్రభావం చూపబోవని చాటి చెబుతున్నారు కొందరు మృగాళ్లు. తాజాగా నిర్భయ కంటే ఘోరమైన రీతిలో ఓ అమ్మాయిని రేప్ చేశారు. హరియాణా రాష్ట్రంలో ఓ అమ్మాయిపై ఏడుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడటమే కాదు.. ఆ తర్వాత తమ నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ అమ్మాయిని హత్య చేసి.. తన శరీరాన్ని ముక్కలుగా నరికేశారు.

హర్యానాలోని రోహ్ తక్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుుగోకి వచ్చింది. రోహ్ తక్ కు చెందిన ఓ మహిళ మే 9న విధులకు వెళ్తుండగా.. ఏడుగురు వ్యక్తులు ఆమెను అపహరించుకుని వెళ్లారు. తర్వాత ఆమెపై అందరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను హత్య చేశారు. శరీరాన్ని ముక్కలుగా నరికారు. అయినప్పటికీ ముఖం చూస్తే ఆమె ఎవరో తెలిసిపోతుందని తన ముఖం గుర్తుపట్టకుండా దానిపై నుంచి వాహనాన్ని నడిపి చిద్రం చేసే ప్రయత్నమూ చేశారు. అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మహిళ ఎవరో తెలుసుకోవడానికి మూడు రోజులు పట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/