Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరి రాకతో ఐపీఎల్​ వేలానికే కళొచ్చింది..!

By:  Tupaki Desk   |   20 Feb 2021 10:30 AM GMT
ఆ ఇద్దరి రాకతో ఐపీఎల్​ వేలానికే కళొచ్చింది..!
X
చెన్నై వేదికగా నిన్న ఐపీఎల్​ 2021 వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ప్రాంచైజీలను కొనుగోలు చేయడానికి పలు జట్లు విపరీతంగా పోటీపడ్డాయి. కొందరు ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయకపోగా.. మరికొందరేమో ఊహించిన రీతిలో అత్యధిక రేటు పలికారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం కార్యక్రమంలో ఓ పిక్​ ఇప్పడు సోషల్​మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.

కోల్​కతా నైట్​రైడర్స్​ యజమానులుగా షారూఖ్​ఖాన్​, జూహీచావ్లా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వేలం కార్యక్రమానికి వీళ్ల పిల్లలు వచ్చారు. షారూఖ్​ ఖాన్​ కుమారుడు ఆర్యన్​ ఖాన్​, జూహీ చావ్లా కూతురు జాహ్నవి మెహతా ఈ వేలం కార్యక్రమానికి హాజరయ్యారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ సహయజమానులతో కలిసి ఈ ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చున్న ఫోటోను జూహీ చావ్లా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘కేకేఆర్​ కిడ్స్​ ఆర్యన్​ , జాహ్నవిలను టేబుల్​ దగ్గర చూడడం ఆనందంగా ఉంది’ అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్​మీడియాలో తెగ వైరల్​గా మారింది.

వీళ్లపై సోషల్​మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘వారసులొచ్చారు’ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. వీళ్ల ఎంట్రీతో ఐపీఎల్​ వేలానికి కళ వచ్చిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్​ వేలంపైనే చర్చ జరుగుతోంది. ఇక ఐపీఎల్​ సీజన్​ వచ్చేసిందంటే రచ్చ మామూలుగా ఉండదు. సినిమా విడుదల కూడా వాయిదా వేస్తారంటే ఐపీఎల్​కు ఉన్న క్రేజ్​ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.