Begin typing your search above and press return to search.

కరోనాపై మరో బాంబ్​ పేల్చిన డబ్ల్యూహెచ్​వో..!

By:  Tupaki Desk   |   2 March 2021 5:30 PM GMT
కరోనాపై మరో బాంబ్​ పేల్చిన డబ్ల్యూహెచ్​వో..!
X
కరోనా మహమ్మారిపై డబ్ల్యూహెచ్​వో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచ దేశాలను అలర్ట్​ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలా దేశాల్లో వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలంతా ఇక కరోనా పోయినట్టేనని మురిసిపోతున్నారు. నిబంధనలు గాలికికొదిలేసి.. మాస్కులు తీసి పారేసి.. భౌతికదూరం అనే సంగతే మరిచిపోయి ఇష్టారాజ్యంగా ఎంజాయ్​ చేస్తున్నారు. అయితే తాజాగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మనదేశంలో కూడా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజువారి కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్​వో కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వైరస్ పూర్తిగా మనల్ని వదలి పోదని తేల్చిచెప్పింది. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన టీకాలతో మరణాల సంఖ్య తగ్గొచ్చని చెప్పింది.

కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కృషిచేయాలని డబ్యూహెచ్ వో అన్ని దేశాలకు సూచించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ డాక్టర్ మైకేల్ ర్యాన్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.అయితే మనమంతా అప్రమత్తంగా ఉండే కరోనా వ్యాప్తిని తగ్గించుకోవచ్చని డబ్ల్యూహెచ్​వో పేర్కొన్నది.

ఈ ఏడాది చివరినాటి కరోనా వైరస్​ పూర్తిగా పోదు.. అయితే మరణాలు, ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య తగ్గొచ్చు అని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. అయితే చాలా దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్​ ప్రారంభమయినప్పటికీ.. ఇంకా పేదదేశాలకు వ్యాక్సిన్​ అందకపోవడం విచారకరమని డబ్ల్యూహెచ్​వో ప్రతినిధులు పేర్కొన్నారు. పేద దేశాలకు వ్యాక్సిన్​ ఇవ్వని ధనిక దేశాల తీరును డబ్ల్యూహెచ్​వో తప్పుపట్టింది.