Begin typing your search above and press return to search.

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త రూల్స్.. పాటించకపోతే చర్యలు తప్పవు !

By:  Tupaki Desk   |   18 Aug 2021 4:30 AM GMT
ఏపీలో పెళ్లిళ్లకు కొత్త రూల్స్.. పాటించకపోతే చర్యలు తప్పవు !
X
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ తగ్గినా , ఇంకా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గింది అని చెప్పలేము. ఎందుకు అంటే కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా జోరు పెరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఐతే మంగళవారం కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపులను మరో గంటపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు సడలింపులిచ్చారు.

ఇక పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే అనుమతి ఉందన్న సీఎం.. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తప్పనిసరి అని అన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ అర్ధరాత్రిగానీ, తెల్లవారుజామునగానీ ముహూర్తాలు ఉంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని వెల్లడించారు. ఫంక్షన్ల సమయంలో ఖచ్చితంగా కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ వెళ్లాలని అన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రతీ స్కూల్‌లో టెస్టింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.45 శాతం ఉందని వైద్యశాఖ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని.. మిగతా మూడు జిల్లాల్లో 3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు. థర్డ్ వేవ్‌ కు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వివరాలని ఒకసారి చూస్తే .. మొత్తం వాక్సినేషన్‌ తీసుకున్నవారు – 1,82,00,284 , సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు – 1,15,98,720,రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయిన వారు – 66,01,563 , ఉపయోగించిన మొత్తం వ్యాక్సిన్‌ డోసులు – 2,48,01,847. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు సీఎం. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.


ఇక, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో.. స్కూళ్లలో ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ వెళ్లాలని అన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రతి పాఠశాలలో టెస్టింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.