Begin typing your search above and press return to search.

నన్నూ చంపేస్తారేమో అంటున్న కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   7 July 2015 3:26 PM IST
నన్నూ చంపేస్తారేమో అంటున్న కేంద్రమంత్రి
X
ఆమె స్వయంగా కేంద్రమంత్రి. ఒక కేంద్రమంత్రిగా ఆమెకు ఉండే భద్రత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ.. అలాంటి ఆమె సైతం ఇప్పుడు తనను చంపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు? ఏ విషయంలో ఆమె అంతగా వణికిపోతున్నారన్న విషయానికి వస్తే..

కేంద్రమంత్రి ఉమాభారతి ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. వ్యాపం కుంభకోణంలో ఇప్పటికి 48 అనుమనాస్పద మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తనను చంపే అవకాశం ఉందని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. వ్యాపం కుంభకోణానికి సంబంధించిన కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఆమె పేరు కూడా ఉంది మరి.

ఒక కేంద్రమంత్రిగా ఉమభారతికే అంత భయాందోళనలు ఉంటే.. ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బీజేపీ నేత మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు.. ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు.. మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అవసరం లేదని చెప్పటం చూసినప్పుడు.. వ్యాపంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కేంద్రమంత్రగా ఉన్న తనకే.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిచ్చెక్కిపోతున్నట్లుగా ఉన్నాయని ఉమ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.