Begin typing your search above and press return to search.

దారుణం: బాలికపై వాలంటీర్ అత్యాచారయత్నం

By:  Tupaki Desk   |   7 March 2021 9:33 AM GMT
దారుణం: బాలికపై వాలంటీర్ అత్యాచారయత్నం
X
ఏపీలో మరో కలకలం చెలరేగింది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరులో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం చేసినట్లు తెలుస్తోంది.

7వ తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన వాలంటీర్ రమేశ్ ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.

అయితే బాలిక గట్టిగా కేకలు వేయడంతో భయపడి పరారయ్యాడు. దీనిపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదే కాదు.. ఇటీవల కాలంలో కొందరు వాలంటీర్లపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. కొన్ని కేసుల్లోనూ వారి ప్రమేయం బయటడడంతో ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టిసారిస్తోంది.