Begin typing your search above and press return to search.

డేంజర్ బెల్: విశాఖలో కల్లోలం..

By:  Tupaki Desk   |   22 July 2020 2:00 PM GMT
డేంజర్ బెల్: విశాఖలో కల్లోలం..
X
ఏపీలో కరోనా కల్లోలంగా మారుతోంది. కొత్త కరోనా కేసులు ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 6045 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60వేలు దాటింది. ఈరోజుకు కేసుల సంఖ్య 64,713 వద్దకు చేరింది.

నిన్న మొత్తం ఏపీలో 49,553 మందికి టెస్టులు చేశారు. ఇందులో ఒక్క విశాఖలోనే ఏకంగా 1049 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వెయ్యికి పైగా కేసులు ఒక జిల్లాలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 891 కొత్త కేసులు నమోదయ్యాయి. వైజాగ్‌లో పోలీసులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు పది పోలీస్ స్టేషన్లలో 50 మంది పోలీసు సిబ్బందికి ఈ వైరస్ సోకింది.

గడిచిన 24 గంటల్లో ఏపీలో 65 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 800 మార్కును తాకింది. గుంటూరు గత 24 గంటల్లో అత్యధికంగా 15 మంది మరణించారు. ఆ తర్వాత కృష్ణ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 31,763 కాగా కరోనా నుంచి కోలుకున్న వారు 32,127మంది ఉన్నారు..