Begin typing your search above and press return to search.

మీరు.. మీ లాజిక్ లేని రూల్స్... ఐసీసీ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం !

By:  Tupaki Desk   |   10 Feb 2021 11:30 PM GMT
మీరు.. మీ లాజిక్ లేని రూల్స్... ఐసీసీ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం !
X
చెన్నై వేదికగా ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ ల్లో ఓటమిపాలైంది. ఈ విక్టరీతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో కోహ్లీసేన నాలుగో స్థానానికి పడిపోగా.. ఇంగ్లండ్ టాప్ కు దూసుకెళ్లింది. ఈ విషయంలో ఐసీసీ పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఫైర్ అయ్యాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు సంబంధించి పర్సంటైల్ రూల్స్ ఎలా మారుస్తారంటూ అసహనం వ్యక్తం చేశాడు. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కాలంలో ఎలాంటి మ్యాచ్ లు జరగకపోవడంతో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో ఐసీసీ ఒక కమిటీని నిర్వహించింది. PCT ఆధారంగా జట్ల స్థానాలు మారే అవకాశం ఉంటాయని అప్పట్లో కుంబ్లే నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. అదే రూల్ పై ఇప్పుడు కోహ్లీ సీరియస్ అవుతున్నాడు.ఈ రూల్ పై కోహ్లీ వ్యతిరేకిస్తూ " పరిస్థితులు అదుపులో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. అలాంటప్పుడు రూల్స్‌ కూడా మారాలి.. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మ్యాచ్‌లు ఓడిపోవడం.. గెలవడం సహజమే.. అయినా మేం పాయింట్ల గురించి అంతగా బాధపడడం లేదు.. అయితే కొన్ని విషయాల్లో మీరు లాజిక్‌ లేకుండా రూల్స్‌ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం కోపం తెప్పించింది అని అన్నాడు.

తొలి టెస్టు ఫలితం అనంతరం ప్రపంచ టెస్టు చాంపియన్ ‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి (68.25 పాయింట్ల శాతం) పడిపోగా, ఇంగ్లండ్‌ (70.16 పాయింట్ల శాతం) అగ్రస్థానానికి చేరుకుంది. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశాలకు తాజా పరాజయంతో కొంత దెబ్బ పడింది. అయితే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోలేదు. ఫైనల్‌ చేరాలంటే భారత్‌ కు మరో 70 పాయింట్లు కావాలి. అంటే కనీసం 2 మ్యాచ్‌లలో విజయంతో పాటు మరో మ్యాచ్‌ డ్రా చేసుకున్నా సరిపోతుంది. అయితే తర్వాతి రెండు టెస్టులో ఒక్క మ్యాచ్‌ ఓడినా టీమిండియా ఆట ముగిసినట్లే.