Begin typing your search above and press return to search.

బాలికపై గ్రామ వలంటీర్ అత్యాచారం!!

By:  Tupaki Desk   |   3 July 2020 3:59 PM GMT
బాలికపై గ్రామ వలంటీర్ అత్యాచారం!!
X
బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఓ గ్రామ వలంటీర్ పాడు పనిచేశాడు. ప్రజలకు సేవ చేయాల్సిన వాడు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ బాలికపై బలత్కారానికి దిగాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ఓ మైనర్ బాలికపై గ్రామ వలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం గూడురుపల్లిలో ఓ అవ్వకు పింఛన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అవ్వ లేకపోవడం.. బాలిక ఒంటరిగా చిక్కడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే గ్రామ వలంటీర్ కావడం.. బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి కొందరు స్థానిక నాయకులు పంచాయితీ పెట్టారు. బాలికకు భరణం చెల్లించేందుకు ఒప్పించడానికి ప్రయత్నించారని తెలిసింది. అయితే పంచాయితీ విఫలం కావడంతో పుంగనూరు పోలీసులకు బాధితురాలు ఎట్టకేలకు ఫిర్యాదు చేసింది. దీంతో వలంటీర్ చేసిన దారుణం వెలుగుచూసింది.