Begin typing your search above and press return to search.

విజ‌య‌సాయిరెడ్డికి లంచం ఇవ్వ‌బోయిన సీఎం బినామీ?

By:  Tupaki Desk   |   14 Jun 2017 1:00 PM GMT
విజ‌య‌సాయిరెడ్డికి లంచం ఇవ్వ‌బోయిన సీఎం బినామీ?
X
వైసీపీలో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - రాజ్య‌స‌భ స‌భ్యుడు వి.విజ‌య‌సాయి రెడ్డి కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు. అటువంటి విజ‌య‌సాయిరెడ్డిని డ‌బ్బుతో కొనాల‌ని చంద్ర‌బాబు బినామీ ఒక‌రు భావించార‌న్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

విశాఖ ప‌ట్నంలో టీడీపీ ఎమ్మెల్యేల భూ కుంభ‌కోణం వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తేవ‌డంలో విజ‌య‌సాయి రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ స్కాం వెనుక న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

మొత్తానికి ఈ స్కాం వెనుక రూ.2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల లావాదావీలు జ‌రిగాయ‌ని వినికిడి. ఈ స్కాం గురించిన అంశాలు బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కుండా ఉండేందుకు వెంక‌ట‌రాజ‌రాజు అనే వ్య‌క్తి త‌న‌కు భారీగా న‌గదు ఆఫ‌ర్ చేశార‌ని విజ‌య సాయి రెడ్డి ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుకు, ఆయ‌న కుమారుడు లోకేష్‌ కు ఈ వెంక‌ట‌రాజ‌రాజు బినామీ అని సాయి రెడ్డి తెలిపారు. డ‌బ్బుతో త‌న‌ను కొన‌లేర‌ని, పేద‌ల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు భూపోరాటం ఆప‌న‌ని విజ‌య సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారంలో సీబీఐ విచార‌ణ చేయించ‌డానికి చంద్ర‌బాబు ఎందుకు వెనుకాడుతున్నార‌ని విజ‌య సాయి రెడ్డి ప్ర‌శ్నించారు.అఖిల ప‌క్ష నేత‌ల‌తో క‌లిసి భూ క‌బ్జా బాధితుల‌ను ఆయ‌న క‌లిశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/