Begin typing your search above and press return to search.

గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి

By:  Tupaki Desk   |   6 Nov 2019 5:03 AM GMT
గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి
X
భారతదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఉన్న సమయంలో సీనియర్ రైటర్ , నటుడు , విమర్శకుడు గొల్లపూడి మారుతీరావు ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నట్టు ఆయనకి తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. గొల్లపూడి గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఈ మద్యే అయన ఆరోగ్యం కొంచెం విషమించడంతో అయనని బంధువులు ఇటీవల చెన్నై ఆస్పత్రిలో చేరారు.

పర్యటనలో భాగంగా చెన్నై కి వచ్చిన వెంకయ్య నాయుడు ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వచ్చి పరామర్శించి , అయన ఆరోగ్యం గురించి డాక్టర్స్ ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కాగా, గొల్లపూడి ఆరోగ్యం కుదుటపడిందని ఈ రోజు డిశ్చార్జ్‌ కానున్నారని ఆయన కుమారుడు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ .. సునిశతమైన విమర్శకు, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించడంలో గొల్లపూడి పెట్టింది పేరని వెంకయ్య అన్నారు. ఆయన త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.