Begin typing your search above and press return to search.

కరోనా నుండి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు !

By:  Tupaki Desk   |   12 Oct 2020 3:30 PM GMT
కరోనా నుండి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు !
X
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా నెగిటివ్ ‌గా తేలింది. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. త్వరలో ఆయన యధావిధిగా విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్య బృందం వెంకయ్యనాయుడికి నేడు కరోనా పరీక్షలు నిర్వహించిందని.. ఫలితం నెగటివ్‌గా నిర్ధారణ అయిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. వెంకయ్యతో పాటు ఆయన సతీమణి ఉషా నాయుడికి కూడా నెగటివ్ ‌గా వచ్చినట్టు తెలియజేశారు.

వెంకయ్యనాయుడికి సెప్టెంబర్ 29న సాధారణంగా‌ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ‌గా తేలడంతో ఐసోలేషన్ ‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ గా తేలింది. ఈ సమయంలో ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అనేక మంది ప్రార్థనలు చేశారని, వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నాను’ అని ఆయన మరో ట్వీట్‌ లో తెలిపారు. కరోనా సంక్రమణ సమయంలో తనకు అవసరమైన ఆరోగ్య సేవలందించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి, అలాగే తనకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన తన వ్యక్తిగత సహాయకులకు కృతజ్ఞతలు చెప్పారు.