Begin typing your search above and press return to search.

తాంత్రిక పూజ‌ల వెనుక టీడీపీ ఎమ్మెల్సీ?

By:  Tupaki Desk   |   4 Jan 2018 10:03 AM GMT
తాంత్రిక పూజ‌ల వెనుక టీడీపీ ఎమ్మెల్సీ?
X
రెండు రాష్ట్రాల్లోని తెలుగువారితో పాటు.. బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ను పూజించే కోట్లాది భ‌క్తులు ఒక్క‌సారి ఉలిక్కిప‌డే ఉదంతం చోటు చేసుకోవ‌టం తెలిసిందే. అర్థ‌రాత్రి వేళ‌.. అనుమ‌తులు తీసుకోకుండా గుట్టుగా.. తాంత్రిక పూజ‌ల్ని దుర్గ‌మ్మ అమ్మ‌వారికి నిర్వ‌హించారంటూ వ‌చ్చిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇప్ప‌టికే ఈ ఉదంతంపై పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్న అధికార‌ప‌క్ష నేత‌లు.. అధికారుల మాట‌ల‌తో ప్ర‌జ‌లు అంత‌కంత‌కూ అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. శాంతిస్వ‌రూప‌మైన అమ్మ‌వారిలో ఉగ్ర‌రూపాన్ని మేల్కొనేలా చేసిన దారుణం అంరిని విస్తు పోయేలా చేస్తోంది.

త‌ప్పు చేసిన వారిపై వేటు వేయాల్సింది పోయి.. ఎవ‌రికి వారు ఈ ఇష్యూను క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అయితే.. ఈ అంశంపై విచార‌ణ క‌మిటీ వేస్తున్నామ‌ని ప్ర‌క‌టిస్తూ చేతులు దులుపుకున్నారు. విచార‌ణ క‌మిటీ అంటే.. విష‌యం ఏమ‌వుతుందో అంద‌రికి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అంశంపై ఏపీ విప‌క్ష పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దుర్గ‌మ్మ గుడిలో జ‌రిగిన తాంత్రిక పూజ‌లు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న అధ్వ‌ర్యంలో జ‌రిగాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఆరోపించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ కోస‌మే ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ఈ ప‌ని చేయించార‌ని ఆరోపించారు. గ‌తంలో టీడీపీ హ‌యాంలోనే అమ్మ‌వారి ఆభ‌ర‌ణాలు చోరీ అయ్యాయ‌ని.. ఈసారి తాంత్రిక పూజ‌లు జ‌రిగిన‌ట్లు మండిప‌డ్డారు. లోకేశ్ కోస‌మే తాంత్రిక పూజ‌లు జ‌రిగాయ‌న్న వెల్లంప‌ల్లి మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

దుర్గ‌మ్మ గుడిలో జ‌రిగిన తాంత్రిక పూజ‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు బాధ్య‌త వ‌హించాల‌న్నారు. హిందువుల మ‌నోభావాల్ని గాయ‌ప‌రుస్తున్న టీడీపీ నేత‌ల తీరుపై ఆయ‌న మండిప‌డ్డారు. తాంత్రిక పూజ‌లు చేయించిన వైనానికి బాధ్య‌త వ‌హించ‌కుంటే అమ్మ‌వారి ఆగ్ర‌హాన్ని చ‌విచూడాల్సి వ‌స్తోంద‌ని మండిప‌డ్డారు.