Begin typing your search above and press return to search.

వైద్యరంగానికి షాక్.. డైట్ తో షుగర్ కు చెక్

By:  Tupaki Desk   |   21 July 2018 11:06 AM GMT
వైద్యరంగానికి షాక్.. డైట్ తో షుగర్ కు చెక్
X
మన తాతల కాలంలో ఏ రోగాలు లేవు.. 70 ఏళ్లు వచ్చినా అప్పట్లో వ్యవసాయం చేస్తూ తొడలు కొట్టేవారు.. ఈ షుగరు, బీపీ, రక్తకణాలు తగ్గిపోయేలాంటి భీకర వ్యాధులు లేవు. అప్పటివారు తిన్న నేచురల్ తిండి..పెరిగిన వాతావరణమే వారిని బలిష్టులుగా చేసింది. కానీ ఇప్పుడంతా మందుల తిండి.. అందుకే రోగాల బారిన పడుతున్నారు.

పూర్వకాలంలో వాడిన డైట్ ను వాడితే షుగర్ - బీపీ - ఉబకాయాలు తగ్గిపోతాయని చాలెంజ్ చేస్తున్నాడు ప్రముఖ డైట్ నిపుణుడు వీరమాచినేని రామృకృష్ణ.. ఈ ప్రకటనతో వైద్యరంగంలో ఆయన ప్రకంపనలు సృష్టిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు - మందుల కంపెనీలకు టార్గెట్ గా మారారు. అత్యంత తక్కువ కాలంలోనే అత్యంత పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన నిజాలు వెల్లడించారు.

తన డైట్ తో షుగర్ ను తగ్గించకపోతే .. డైట్ ను అనుసరించడం వల్ల ఎవరికైనా హాని కలిగినట్టు నిరూపిస్తే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని వీరమాచినేని రామృకృష్ణ సవాల్ విసురుతున్నాడు. ఈ డైట్ ప్రచారం కోసమే దేశమంతా తిరుగుతున్నానని.. మూడు నెలలు తన డైట్ పాటిస్తూ ఆహార పదార్థాలను త్యాగం చేస్తే షుగర్ పూర్తిగా తగ్గిపోతుందని భరోసానిస్తున్నారు.

తన డైట్ ను ఫాలో అవుతూ.. డజను మామిడి పండ్లను తిన్న షుగర్ పేషెంట్లను చూపిస్తానంటూ రామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే 30 మంది పేషెంట్లను తనకు అప్పగించాలని.. వారికి షుగర్ తగ్గించలేకపోతే నన్ను జైల్లో వేయండని సవాల్ విసిరారు. ఓడిపోతే డైట్ ప్రచారం అంటూ తిరగడం శాశ్వతంగా మానేస్తానంటున్నాడు.

తనకు ప్రచారం రాకుండా అడ్డుకుంటున్నవి మందుల కంపెనీలేనని.. షుగర్ నా వల్ల తగ్గిపోతే ఆ మందుల కంపెనీలన్నీ మూసుకోవాల్సి ఉంటుందనే కుట్ర చేస్తున్నాయని రామకృష్ణ ఆరోపించారు. ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా సొంత ఖర్చులతో ప్రజల్లో డైట్ గురించి అవగాహన కల్పిస్తానని తెలిపారు.