Begin typing your search above and press return to search.

జూదంలో భార్యను పందేనికి పెట్టిన భర్త.. తర్వాతేమైందంటే?

By:  Tupaki Desk   |   3 Aug 2019 5:09 AM GMT
జూదంలో భార్యను పందేనికి పెట్టిన భర్త.. తర్వాతేమైందంటే?
X
జూదంలో పందేం కోసం చివరకు భార్యను పణంగా పెట్టేసిన పాండవుల కథను మహాభారతంలో చదివాం. నిజానికి.. ఈ ఎదవను పాండవులతో అస్సలు పోల్చకూడదు. కాకుంటే.. జరిగిన సీన్ చూసినంతనే మహాభారతం గుర్తుకు వస్తుంది. నేటి భారతంలో జూదంలో భార్యను పందేనికి పెట్టిన ఒక కసాయి భర్తకు సంబంధించిన షాకింగ్ నిజమిది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఒకరు భార్యను జూదంలో పందేనికి పెట్టిన దుర్మార్గం ఒకటి బయటకు వచ్చింది.

జౌన్ పుర్ జిల్లాలోని జఫారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ దంపతులు నివసిస్తున్నారు. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీనికి జూదం ఆడే దరిద్రమైన లక్షణం ఉంది. స్నేహితులతో జూదం ఆడిన క్రమంలో ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరకు భార్యను పందేంగా పెట్టాడు. ఓడిన అతడు.. భార్యపై స్నేహితులతో సామూహిక అత్యాచారం చేయించాడు.

ఈ అవమానంతో ఆమె ఇల్లు విడిచి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అనంతరం వారింటికి వెళ్లిన భర్త.. ఆమెను కన్వీన్స్ చేసి మళ్లీ ఇంటికి తెచ్చే క్రమంలో మరోసారి స్నేహితుల చేత అత్యాచారం చేయించాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయగా.. ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానికకోర్టును ఆశ్రయించింది. స్పందించిన కోర్టు.. ఈ ఉదంతంపై కేసు నమోదు చేయాలని ఆదేశాల్ని జారీ చేసింది. చేసేదేమీ లేని పోలీసులు.. భర్త.. అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలాంటి కసాయి భర్తను ఏం చేసినా తక్కువేనేమో?