Begin typing your search above and press return to search.

బడ్జెట్: పోలవరంకి ఎంతిచ్చారో తెలుసా!?

By:  Tupaki Desk   |   29 Feb 2016 2:35 PM IST
బడ్జెట్: పోలవరంకి ఎంతిచ్చారో తెలుసా!?
X
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు కొన్ని కీలక కేటాయింపులు చేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి మీద కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇక్కడ ఏర్పాటు చేయదలిచిన ఐఐటీకి బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించడం విశేషం. దీంతో పాటు తిరుపతిలోనే ఏర్పాటు చేయబోతున్న ఐఐఎస్సీఆర్ కు సైతం రూ.40 కోట్లు కేటాయించారు. ఏపీకి సంబంధించి ముఖ్యమైన కేటాయింపుల వివరాలివి...

తిరుపతి ఐఐటీకి రూ.40 కోట్లు
తిరుపతి ఐఐఎస్సీఆర్ కు రూ.40 కోట్లు
విజయవాడ మెట్రోకు రూ.100 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు
తాడేపల్లి గూడెం ఎన్ఐటీకి రూ.40 కోట్లు
విశాఖ ఐఐఎంకు రూ.30 కోట్లు
ఏపీలో ట్రిపుల్ ఐటీలకు రూ.20 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన యూనివర్శిటీకి రూ.కోటి