Begin typing your search above and press return to search.

మలుపులు తిరుగుతున్న వైఎస్ వివేకా హత్య కేసు

By:  Tupaki Desk   |   21 Jan 2022 6:11 AM GMT
మలుపులు తిరుగుతున్న వైఎస్ వివేకా హత్య కేసు
X
వైఎస్ వివేకా హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ హత్య కేసులో నిందితుల మధ్య కొనసాగుతున్న వివాదం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏ4 నిందితుడు డ్రైవర్ దస్తగిరి 164 వాంగ్మూలంపై సహచర నిందితులు మొదటి నుంచి అభ్యంతరం తెలుపుతున్నారు.

దస్తగిరి అప్రైవర్ గా మారడానికి అనుమతిచ్చిన కోర్టు ఉత్తర్వులపై కూడా సహచర నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ వాళ్లు వేసిన పిటీషన్ పై గురువారం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

వివేకా హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరును నిందితుడు దస్తగిరి చెప్పిన సంగతి తెలిసిందే.

శివశంకర్ రెడ్డితోపాటు వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లను కూడా దస్తగిరి ప్రస్తావించినా సంగతి తెలిసిందే.

వివేకా కూతురు డాక్టర్ సునీత కూడా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో దేవిరెడ్డి పేరుంది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో అరెస్ట్ అయ్యి కడప కేంద్ర కారాగారంలో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.

ఈ హత్య చేస్తే శంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తానన్నాడని.. రూ.5 కోట్లు నీకు ఇస్తానని వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి నేర అంగీకార వాంగ్మూలంలో వెల్లడించాడు..

ఇప్పటికే తన తండ్రి వివేకా హత్యపై డాక్టర్ సుజాత కొన్ని ఆధారాలను సమర్పించింది.అందులో శివశంకర్ రెడ్డి పాత్రపై విచారించాలని కోరింది.

మరి నిందితుడు దస్తగిరి, డాక్టర్ సునీతలు అనుమానించిన దేవి రెడ్డి నుంచి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయన్నది వేచిచూడాలి.