Begin typing your search above and press return to search.

ఆయన నయా నిజాం.. ఆ ఎంపీ కాశీం రిజ్వి

By:  Tupaki Desk   |   9 July 2015 10:19 AM IST
ఆయన నయా నిజాం.. ఆ ఎంపీ కాశీం రిజ్వి
X
తరచూ తన పంచ్‌ డైలాగులతో తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే తెలంగాణ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై తొలిసారి టీటీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై భారీ వ్యాఖ్యలు చేశారు.

తరచూ తమ అధినేత చంద్రబాబునాయుడ్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై పెద్దగా స్పందించని తమ్ముళ్లు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ధ్వజమెత్తటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అచ్చంగా నిజాం నవాబు మాదిరి వ్యవహరిస్తుంటే.. ఆయన వద్ద పని చేసిన కాశీం రిజ్వి మాదిరి పెద్దపల్లి ఎంపీ సుమన్‌ వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దొరలగడీలో కూర్చొని.. దొరల డైరెక్షన్‌లో సుమన్‌ టీడీపీ నేతల్ని విమర్శించటానికి ఆత్రుత పడుతున్న సుమన్‌కు ప్రజా సమస్యలు పట్టటం లేదని మండిపడ్డారు. తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు కాస్తంత కలకలాన్ని సృష్టిస్తున్నాయి. అంతేకాదు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దీక్ష చేస్తుంటే కనీసం వారిని పలుకరించే పని కూడా సుమన్‌ చేయలేదని.. అదే సమయంలో రాజకీయ పంచ్‌ డైలాగులు మాత్రం చేస్తూ కాలం గడుపుతున్నారంటూ మండి పడ్డారు.

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె.. ఎంపీ కవితమ్మ బ్యాగు మోసినంత ఈజీగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరి.. ఈ వ్యాఖ్యలకు పెద్దపల్లి ఎంపీ ఎలా రియాక్ట్‌ అవుతారో..?