Begin typing your search above and press return to search.

నెరేడ్‌మెట్ ఉత్కంఠత కి ముగింపు ... తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు !

By:  Tupaki Desk   |   7 Dec 2020 10:38 AM GMT
నెరేడ్‌మెట్ ఉత్కంఠత కి ముగింపు ... తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు !
X
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠతకి గురి చేసిన నెరేడ్ మెట్ ఎన్నికల ఫలితాలు వెల్లడించడానికి లైన్ క్లియర్ అయింది. జీహెచ్ ఎంసి ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా నిలచిపోయిన నెరేడ్‌ మెట్ ఫలితంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈనెల 4న లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నెరేడ్‌ మెట్ జీహెచ్ ఎం సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఎన్నికల కౌంటింగ్ ‌కు కొద్ది గంటల ముందు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో బీజేపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ ఈ సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ, బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వస్తిక్ గుర్తు ఉన్నవాటిని మాత్రమే పరిగణంలోకి తీసుకునేలా చూడాలని బీజేపీ నేతలు కోరారు.

కౌంటింగ్ కి ముందు రోజు రాత్రి, ఎన్నికల సంఘం ఉత్తర్వులపై గత విచారణలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ ‌లో అప్పీల్ పిటీషన్‌ ను ఎన్నికల సంఘం దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలతోనే నెరేడ్‌ మెట్ ఫలితాలు ఆగిపోయాయని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. అప్పీల్ పిటీషన్‌ ను డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేయలేమని డివిజన్ బెంచ్ తెలిపింది. సింగిల్ బెంచ్‌లో తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. నేడు పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ బెంచ్ మరోసారి విచారణ చేసి తీర్పు వెల్లడించింది.