Begin typing your search above and press return to search.

అనాథ పిల్లలకు ట్రూజెట్ గగన విహారం

By:  Tupaki Desk   |   26 Jan 2019 6:37 AM GMT
అనాథ పిల్లలకు ట్రూజెట్ గగన విహారం
X
గణతంత్ర దినోత్సవం సందర్బంగా అనాథ పిల్లలకు మేఘా టర్బో ఎయిర్వేస్ చిన్నారులు కలలలో కూడా ఊహించని విమానయానాన్ని అందించింది. పిల్లల్లో అత్మ స్థైర్యాన్ని పెంపోందించేందుకు ట్రూజెట్ "వింగ్స్ ఆఫ్ హోప్" పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని గత ఏడాదిగా నిర్వహిస్తున్నది. అనాథ పిల్లలకు విమానయానాన్ని ఉచితంగా కల్పించడంతో పాటు వారిని వివిధ దర్శనీయ స్థలాలకు తీసుకువెళుతున్నది. వింగ్స్ ఆఫ్ హోప్-3 కార్యక్రమంలో భాగంగా చార్మినార్కు చెందిన ఆశ్రిత రెయిన్ బో ఫౌండేషన్, గాజుల రామారానికి చెందిన కేర్ అండ్ లవ్ స్వచ్ఛంద సంస్థలకు చెందిన 30 మంది చిన్నారులను శనివారం ఉదయం 9.15 నిమిషాలకు కడపకు ట్రూజెట్విమానంలో తీసుకువెళ్లింది. పిల్లలంతా ఉత్సాహంగా విమానంలోకి ప్రవేశించారు. విమానం గాలిలోకి ఎగిరే సమయంలో "జింగ్... జింగ్.. అమేజింగ్..." అంటూ కేరింతలు కొట్టారు. విమానం కిటికీల్లోంచి చూస్తూ పట్టరాని ఆనందంతో కేరింతలు కొట్టారు. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని అనుకున్న కోరికను ట్రూజెట్తీర్చిందన తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి తెలిపింది. తనకు చాలా ఆనందంగా ఉందని, ఏ మాత్రం భయం వేయలేదని దుర్గాదేవీ అనే మరో విద్యార్థి దుర్గాదేవి తెలిపింది. తొలిసారిగా విమానంలో ప్రయాణిస్తున్నందున తనకు కొంచె భయం వేసిందని అయితే విమానం పైకి ఎగిరిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించిందని నాలుగో తరగతి విద్యార్థి నోయెల్ తెలిపారు.

కడప జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలకు ట్రూజెట్ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లింది. తొలుత పుష్పగిరి ఆలయం ఆ తర్వాత గండికోటను సందర్శించారు. పిల్లలంతా గండికోటను చూసేందుకు అధిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అక్కడి నుంచి కడపలోని దర్గాకు తీసుకెళ్లారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో చిన్నారులు భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్కు ట్రూజెట్తీసుకురానుంది. విమానయానం, వసతి, భోజన సదుపాయాలతో పాటు వివిధ దర్శనీయ స్థలాల సందర్శనను ట్రూజెట్భరించింది.

వింగ్స్ ఆఫ్ హోప్ కింద ఇప్పటివరకు 300 మంది విద్యార్థులను తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్కు 40 మంది అనాథ విద్యార్థులను కర్ణాటకలోని హంపికి వాల్మికీ ఫౌండేషన్ సహకారంతో తీసుకువెళ్లింది. గత ఏడాది బాలల దినోత్సవం సందర్భంగా విద్యా, విజ్గాన యాత్ర కోసం తమిళనాడులోని ఎస్ ఆర్వీవీ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులను చెన్నై నుంచి సేలంకు ట్రూజెట్తీసుకువెళ్లింది. గత ఏడాది కేరళ వరదల సందర్భంగా కూడా మూడు రోజుల పాటు బాధితులను తిరువనంత పురం నుంచి చెన్నైకి ఉచితంగా తీసుకురావడంతో పాటు చెన్నై నుంచి పునరావాస సామగ్రని తీసుకువెళ్లింది.

ఫిబ్రవరి 13 నుంచి నాసిక్, ఇండోర్లకు ట్రూజెట్విమాన సర్వీసులు

టర్బో మేఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ఫిబ్రవరి 13 నుంచి అహ్మదాబాద్ నుంచ ఇండోర్కు , నాసిక్లకు విమాన సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే అహ్మదాబాద్ కేంద్రంగా పోర్ బందర్, జైసైల్మేర్ విమానసేవలను అందిస్తున్నది. హైదరాబాద్ తర్వాత అహ్మదాబాద్ ట్రూజెట్కు రెండవ బేస్ స్టేషన్. ట్రూజెట్త్వరలో మరో రెండు ఎయిర్ క్రాఫ్ట్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం 5 విమానాలతో 17 మార్గాల్లో ట్రూజెట్తన సేవలను అందిస్తున్నది. విమాన కనెక్టవిటీ లేని ప్రముఖ వ్యాపార కేంద్రాలకు ట్రూజెట్విమాన సేవలను ఉడాన్ పథకం కింత విమాన సర్వీసులను నడుపుతున్నది. హైదరాబాద్, చెన్నై, ముంబై, గోవా, ఔరంగాబాద్, సేలం, మైసూర్, బళ్లారి, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కడప, విద్యానగర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు ట్రూజెట్విమాన సర్వీసులను నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కు విమాన సర్వీసులన నడుపుతున్న ఏకైక విమాన సంస్థ ట్రూజెట్మాత్రమే.