Begin typing your search above and press return to search.

బీజేపీ నేతలను కొట్టండి... టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న పిలుపు

By:  Tupaki Desk   |   18 Feb 2022 3:07 AM GMT
బీజేపీ నేతలను కొట్టండి... టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న పిలుపు
X
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ సందర్భాన్ని బట్టి.. రాష్ట్ర బీజేపీ నేతలను కూడా టార్గెట్‌ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

దీంతో తెలంగాణలో టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. తాము సైతం త‌గ్గేది లేదంటూ కొన్ని సందర్భాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పర్యటనలను టీఆర్ఎస్‌ శ్రేణులు అడ్డుకుంటున్నారు. దాడులు, ప్రతిదాడులకు కూడా దారితీశాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి ఓ సంఘ‌ట‌న‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్మూర్‌లో ఇలా టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా మారిన సంఘ‌ట‌న‌లో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై తాజాగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్ స్పందిస్తూ బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడమే కరెక్ట్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్మూర్‌లో జరిగింది అంటూ చెప్పుకొచ్చిన ఆయన… నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాగే బీజేపీ నేత‌లు అడ్డుకుంటే ఎదురు తిరగండి, ఎక్కడిక్కడ అడ్డుకోండి అంటూ టీఆర్ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మ‌రోవైపు ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ గురించి సైతం బాజిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్ప‌ష్టం చేశారు.

ఆర్మూర్‌లో దాడి మంచిదేనంటూ సమర్థించడ‌మే కాకుండా మ‌రో గ్రామంలోనే ఇలాంటిది జ‌ర‌గాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు బాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.