Begin typing your search above and press return to search.

గులాబీ గుర్రాలు రెఢీ అంటున్నారు

By:  Tupaki Desk   |   4 Dec 2015 5:24 AM GMT
గులాబీ గుర్రాలు రెఢీ అంటున్నారు
X
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ అయ్యింది. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్సీల్ని ఎన్నుకోనున్నారు. వీరికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు వివిధ పార్టీలు మొదలు పెట్టనున్నాయి.

మిగిలిన పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు సమర్థుల్ని వెతికే పనిలో బిజీగా ఉంటే.. తెలంగాణ అధికారపక్షం మాత్రం మొత్తం 12 స్థానాలకు 12 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా వెల్లడి కాకున్నా.. టీఆర్ఎస్ అభ్యర్థులు వీరేనన్న మాట వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా భావిస్తున్న వారిని చూస్తే..

మెదక్ - భూపాల్ రెడ్డి

ఖమ్మం - బాలసాని లక్ష్మీనారాయణ

నల్గొండ - తేరా చిన్నపరెడ్డి

వరంగల్ - కొండా మురళీ

రంగారెడ్డి - పట్నం నరేందర్ రెడ్డి.. శంభీపూర్ రాజు

కరీంనగర్ - భానుప్రసాద్.. నారదాసు లక్ష్మణ్

అదిలాబాద్ - పురాం సతీష్

నిజామాబాద్ - భాస్కర్ భూపతిరెడ్డి

మహబూబ్ నగర్ - జగదీశ్వర్ రెడ్డి.. జైపాల్ యాదవ్