Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : వైరస్ తో సీఎం పీఏ మృతి
By: Tupaki Desk | 17 Jun 2020 9:30 AM GMTదేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ భారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. సామాన్యుల నుండి విఐపిలు , ప్రముఖులు ఇలా ఏ తేడా లేకుండా అందరూ ఈ వైరస్ భారిన పడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి పీఏ కి వైరస్ సోకి మృతి చెందినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. సీఎం పీఏ అంటే తెలుగు రాష్ట్రాల సీఎంల పీఏ కాదు ..తమిళనాడు సీఎం పీఏకి వైరస్ సోకినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.తమిళనాడు సీఎం పళని స్వామి పీఏ దామోదరం నేడు వైరస్ తో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్పారని ప్రచారం జరుగుతుంది.
ఇండియాలో వైరస్ విజృంభణ చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. కాగా వైరస్ మరణాలు సంఖ్య కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 2003 మంది వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 11,903కి చేరింది. డెత్ రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం గమనార్హం. కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,86,934గా ఉంది.
ఇండియాలో వైరస్ విజృంభణ చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. కాగా వైరస్ మరణాలు సంఖ్య కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 2003 మంది వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 11,903కి చేరింది. డెత్ రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం గమనార్హం. కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,86,934గా ఉంది.